AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 231, నిఫ్టీ 69 పాయింట్లు అప్..

వరుస నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల బాట పట్టాయి. దేశీయ సూచీలు నేటి సెషన్‌లో లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 231, నిఫ్టీ 69 పాయింట్లు అప్..
Stock Market
Srinivas Chekkilla
|

Updated on: Mar 28, 2022 | 4:35 PM

Share

వరుస నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం లాభాల బాట పట్టాయి. దేశీయ సూచీలు నేటి సెషన్‌లో లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చైనా(China) ఆర్థిక కేంద్రమైన షాంఘైలో కోవిడ్ -19 కారణంగా లాక్‌డౌన్‌(Lock Down)ను ప్రకటించిన తర్వాత ఆసియా మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముడి చమురు ధరలు ఈ రోజు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్ బ్యారెల్‌ ధర 116.33 డాలర్లకు పడిపోయింది. దీంతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 231 పాయింట్లు పెరిగి 57,593 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 17,222 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.18 శాతం, స్మాల్ క్యాప్ 0.73 శాతం నష్టపోయాయి.

1,178 కంపెనీల షేర్లు పెరగ్గా, 2,331 కంపెనీల షేర్లు తగ్గాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, ఎస్‌బిఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. పీవీఆర్, ఐనక్స్ కంపెనీలు విలీనమవుతాయని వార్తలు రావడంతో PVR షేర్లు 3.53 శాతం వరకు పెరిగాయి. INOX షేర్లు 11.75 శాతం మేర పెరిగాయి. నెస్లే ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌సిఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఎల్‌అండ్‌టి నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 1.22 శాతం, నిఫ్టీ బ్యాంక్ 0.85 శాతం పెరిగాయి. భారతీ ఎయిర్‌టెల్ నిఫ్టీలో టాప్‌గెయినర్‌గా నిలిచింది. ఆ కంపెనీ స్టాక్ 3.90 శాతం పెరిగి రూ. 737 వద్ద స్థిరపడింది. డిమెర్జర్ తర్వాత మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా (MSWIL) సోమవారం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. రూ.66 వద్ద లిస్ట్ అయిన తర్వాత రూ.69.30 గరిష్ఠానికి చేరికుని చివరికి 62.70 వద్ద స్థిరపడింది.

Read Also.. Jio Recharge Plan: ఇకపై నెల రోజులకు ఒకేసారి రీఛార్జ్‌.. యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్‌..

Follow Us
ఇక కేవలం 15 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం..ఈ బ్యాంకు కొత్త పోర్టల్
ఇక కేవలం 15 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం..ఈ బ్యాంకు కొత్త పోర్టల్
బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తెపై దాడి..?
బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తెపై దాడి..?
అశ్విన్‌ను దాటేందుకు బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ రెడీ
అశ్విన్‌ను దాటేందుకు బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ రెడీ
అందుకే కష్టపడి ఎక్కువ సినిమాలు చేస్తున్నా..
అందుకే కష్టపడి ఎక్కువ సినిమాలు చేస్తున్నా..
కాంగ్రెస్ కార్యకర్తల తీరును తప్పుబడుతున్న పలు రాజకీయ పక్షాలు
కాంగ్రెస్ కార్యకర్తల తీరును తప్పుబడుతున్న పలు రాజకీయ పక్షాలు
మీ బ్యాంకు అకౌంట్‌లో జీరో ఉన్నా రూ.10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు
మీ బ్యాంకు అకౌంట్‌లో జీరో ఉన్నా రూ.10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు
ఈ సమస్యలన్నీ పరార్.. కివి పండు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఈ సమస్యలన్నీ పరార్.. కివి పండు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
రాత్రిపూట మిగిలిన చికెన్ పిల్లలకి వేడి చేసి పెడుతున్నారా?
రాత్రిపూట మిగిలిన చికెన్ పిల్లలకి వేడి చేసి పెడుతున్నారా?
ఒక్కమ్యాచ్ కూడా గెలవలేదు కానీ..వరల్డ్ రికార్డు మాత్రం కొట్టేసింది
ఒక్కమ్యాచ్ కూడా గెలవలేదు కానీ..వరల్డ్ రికార్డు మాత్రం కొట్టేసింది
విదేశీ ఆపిల్స్ తింటే మంచిదా.. స్వదేశీనా..? వైద్య నిపుణుల మాటేంటి?
విదేశీ ఆపిల్స్ తింటే మంచిదా.. స్వదేశీనా..? వైద్య నిపుణుల మాటేంటి?