AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. అతి తక్కువ సమయంలోనే అనుమతులు..

స్టాక్ బ్రోకర్లకు తమ వ్యాపారాన్ని సులభతరం చేయడం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) తన సర్క్యులర్‌లో కీలక అంశాలు పేర్కొంది. దీని ప్రకారం ఇంటర్నెట్ ఆధారిత వ్యాపార సేవలను అందించడానికి అధికారిక అనుమతి కోసం బ్రోకర్ సంబంధిత స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు దరఖాస్తు చేస్తే.. స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 క్యాలెండర్ రోజులలోపు సభ్యునికి తన నిర్ణయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు 7 రోజులలోపే నిర్ణయాన్ని వెల్లడి చేయాల్సి ఉంటుంది.

Stock Market: ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. అతి తక్కువ సమయంలోనే అనుమతులు..
Share Market
Madhu
|

Updated on: Jun 01, 2024 | 4:46 PM

Share

ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. రిస్క్ ఎక్కువైనా వీటిల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే వీటిల్లో అధిక రాబడి వస్తుండటమే అందుకు కారణం. ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆన్ లైన్ లోనే తమ పెట్టుబడులను పెట్టడం, వాటిని ట్రాక్ చేయడం చేస్తున్నారు. చాలా మంది తమ ఫోన్లలోనే ట్రేడింగ్ చేస్తున్నారు. అయితే ఇలా చేయాలంటే ఆన్ లైన్ ట్రేడింగ్ కు అనుమతి పొందాల్సి ఉంటుంది. దీని కనీసం 30 రోజుల సమయం పడుతుంది. అయితే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఓ శుభవార్త చెప్పింది. ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్ చేసే స్టాక్ బ్రోకర్లకు అనుమతి మంజూరు చేయడానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు తీసుకునే సమయాన్ని ప్రస్తుత 30 రోజుల నుంచి ఏడు రోజులకు గణనీయంగా తగ్గించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

వ్యాపారం సులభతరం..

స్టాక్ బ్రోకర్లకు తమ వ్యాపారాన్ని సులభతరం చేయడం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) తన సర్క్యులర్‌లో కీలక అంశాలు పేర్కొంది. దీని ప్రకారం ఇంటర్నెట్ ఆధారిత వ్యాపార సేవలను అందించడానికి అధికారిక అనుమతి కోసం బ్రోకర్ సంబంధిత స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు దరఖాస్తు చేస్తే.. స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 క్యాలెండర్ రోజులలోపు సభ్యునికి తన నిర్ణయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు 7 రోజులలోపే నిర్ణయాన్ని వెల్లడి చేయాల్సి ఉంటుంది.

ఎక్కడి నుంచైనా వ్యాపారం..

ఇంటర్నెట్ ట్రేడింగ్ అంతా ఆర్డర్ రూటింగ్ సిస్టమ్‌ల ద్వారా జరుగుతుంది. ఇది క్లయింట్ ఆర్డర్‌లను అమలు చేయడానికి ట్రేడింగ్ సిస్టమ్‌లను మార్పిడి చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అందువల్ల దేశంలోని ఏ ప్రాంతంలోనైనా కూర్చున్న క్లయింట్ బ్రోకర్ల ఇంటర్నెట్ ట్రేడింగ్ సిస్టమ్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను మాధ్యమంగా ఉపయోగించి వ్యాపారం చేయవచ్చు. అలాగే స్టాక్ ఎక్స్ చేంజ్ ల ద్వారా ప్రచురితమయ్యే స్టాక్ బ్రోకర్ల ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్(ఐబీటీ)గణాంకాలను కాలానుగుణంగా ప్రకటించాల్సిన అవసరం కూడా లేకుండా కొత్త రెగ్యూలేటరీని తీసుకొచ్చింది. దీనికి బదులుగా స్టాక్ బ్రోకర్లు అందించిన ఐబీటీ టెర్మినల్స్ వివరాల ఆధారంగా ఎక్స్ఛేంజీలు ఐబీటీ గణాంకాలను ప్రచురిస్తాయి. ఇంకా ఎక్స్ఛేంజీలు, ఈ విషయంలో ఐబీటీ టెర్మినల్స్ గురించిన సమాచారం/డిక్లరేషన్‌ను స్టాక్ బ్రోకర్ల నుంచి తమకు సరిపోతాయని భావించవచ్చు. స్టాక్ బ్రోకర్ల ఇండస్ట్రీ స్టాండర్డ్ ఫోరమ్ (ఐఎస్ఎఫ్) నుంచి ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్‌కు సంబంధించిన అభ్యర్థనలను సెబీ స్వీకరించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సెబీ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..