AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: దేశంలో అతిపెద్ద టెలికాం బ్రాండ్‌గా రిలయన్స్‌ జియో.. జాబితా విడుదల చేసిన ట్రాయ్

దేశంలోని అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో బలమైన టెలికాం బ్రాండ్‌గా ఎంపికైంది. బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ కంపెనీ..

Reliance Jio: దేశంలో అతిపెద్ద టెలికాం బ్రాండ్‌గా రిలయన్స్‌ జియో.. జాబితా విడుదల చేసిన ట్రాయ్
Reliance Jio
Subhash Goud
|

Updated on: Nov 14, 2022 | 7:02 AM

Share

దేశంలోని అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో బలమైన టెలికాం బ్రాండ్‌గా ఎంపికైంది. బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ కంపెనీ ట్రాయ్‌ ఒక నివేదికలో ఈ సమాచారాన్ని అందించింది. ట్రాయ్‌ కంపెనీలను వారి బ్రాండ్ సామర్థ్యాన్ని బట్టి ‘ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ బ్రాండ్స్ 2022’ జాబితాలో ర్యాంక్ ఇచ్చింది. టెలికాం కంపెనీల విభాగంలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, బీఎస్‌ఎన్‌ఎల్‌ స్థానాలు వచ్చాయి.

దుస్తులలో అగ్రగామిగా అడిడాస్:

ఇక బట్టల విభాగంలో అడిడాస్ టాప్ బ్రాండ్‌గా స్థానం సంపాదించింది. ఆ తర్వాత నాయక్, రేమండ్, అలాన్ సోలీ, పీటర్ ఇంగ్లండ్ ఉన్నారు. అదే సమయంలో వాహనాల జాబితాలో బీఎండబ్ల్యూ అగ్రస్థానంలో ఉండగా, టయోటా, హ్యుందాయ్, హోండా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌లో ఎల్‌ఐసి మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) రెండవ స్థానంలో, ఐసిఐసిఐ బ్యాంక్ మూడవ స్థానంలో ఉన్నాయి.

ఇక వినియోగదారుల విషయంలో ఎల్‌జీ, సోనీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొదటి మూడు బ్రాండ్‌లుగా ఉన్నాయి. వివిధ గ్రూపుల జాబితాలో ఐటీసీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత టాటా, రిలయన్స్‌లు ర్యాంక్‌లో నిలిచాయి. పవర్ కేటగిరీలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) అగ్రస్థానంలో ఉండగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), అదానీ గ్రూప్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

పాల విభాగంలో అమూల్ అగ్రస్థానం:

ఆహారం, పానీయాల విభాగంలో అమూల్ బ్రాండ్ అగ్రస్థానంలో ఉంది. ఆపై లాక్మే, నివియా, కోల్‌గేట్ ఉన్నాయి. ఇంటర్నెట్ బ్రాండ్‌ల జాబితాలో అమెజాన్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇది కాకుండా, ముఖేష్ అంబానీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో క్రమంగా తన 5G సేవలను కొత్త నగరాల్లో ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభిస్తోంది. తన 5G సేవను విస్తరిస్తున్నప్పుడు కంపెనీ తన 5G సేవలను బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా ప్రారంభించింది. కొంతకాలం క్రితం రిలయన్స్ జియో తన బీటా ట్రయల్‌ని దేశంలోని 6 నగరాల్లో ప్రారంభించిందని, హైదరాబాద్, బెంగళూరు కంటే ముందు వారణాసి, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, నాథ్‌ద్వారాలలో జియో 5G సేవ అందించబడుతుందని గుర్తుంచుకోండి.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!