Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Mutilated Notes: ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..? ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

ఏటీఎం నుంచి డబ్బు తీసుకునేటప్పుడు చాలా సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. దీంతో మార్కెట్‌లోని దుకాణదారులు వాటిని అంగీకరించడానికి నిరాకరిస్తారు. మీరు ఎప్పుడైనా అటువంటి క్లిష్ట పరిస్థితిలో చిక్కుకున్నట్లయితే ఎలాంటి టెన్షన్‌ పడవద్దు. ఎందుకంటే అటువంటి మ్యుటిలేటెడ్ నోట్లను..

ATM Mutilated Notes: ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..? ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
Mutilated Notes
Follow us
Subhash Goud

|

Updated on: May 19, 2023 | 5:36 PM

ఏటీఎం నుంచి డబ్బు తీసుకునేటప్పుడు చాలా సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. దీంతో మార్కెట్‌లోని దుకాణదారులు వాటిని అంగీకరించడానికి నిరాకరిస్తారు. మీరు ఎప్పుడైనా అటువంటి క్లిష్ట పరిస్థితిలో చిక్కుకున్నట్లయితే ఎలాంటి టెన్షన్‌ పడవద్దు. ఎందుకంటే అటువంటి మ్యుటిలేటెడ్ నోట్లను మార్చే బాధ్యత బ్యాంకుపై ఉంటుంది. ఏటీఎం నుంచి చిరిగిన నోట్లను తీసుకుని నేరుగా బ్యాంకుకు వెళ్లండి. నోట్‌ని మార్చడానికి మీరు ఏమి చేయాలి..? ఎలాంటి నియమాలున్నాయో తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏటీఎంల నుంచి పంపిణీ చేయబడిన మ్యుటిలేటెడ్ పాత నోట్లను మార్చడానికి నియమాలను రూపొందించింది. నిబంధనల ప్రకారం.. ఏటీఎం నుంచి పంపిణీ చేయబడిన మ్యుటిలేటెడ్ నోటును మార్చడానికి బ్యాంకు నిరాకరించదు. మీరు దీన్ని సులభంగా మార్చవచ్చు. ఎలాంటి ఛార్జీ ఉండదు.

ఇతర బ్యాంకులు ఇలాంటి నోట్లను తీసుకునేందుకు నిరాకరించినట్లయితే రూ.10,000 జరిమానా విధించవచ్చని 2016 జూలైలో రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నిబంధన అన్ని బ్యాంకు శాఖలకు వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ఏటీఎం నుంచి నకిలీ లేదా చిరిగిన నోటు బయటకు వస్తే అది బ్యాంకు బాధ్యత. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏటీఎం నుంచి బయటకు వచ్చే నోటులో ఏదైనా లోపం ఉంటే బ్యాంకు ఉద్యోగులతో విచారణ చేయించాలి. నోట్‌పై సీరియల్ నంబర్, మహాత్మాగాంధీ వాటర్‌మార్క్, గవర్నర్ సంతకం కనిపిస్తే, బ్యాంకు ఏదైనా సందర్భంలో నోటును మార్చవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మ్యుటిలేటెడ్ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు సర్క్యులర్లను జారీ చేస్తూనే ఉంటుంది. అటువంటి నోట్లను మీరు ఏదైనా బ్యాంకు శాఖలో లేదా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలో సులభంగా మార్చుకునే పరిమితి ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒకేసారి గరిష్టంగా 20 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. అలాగే ఈ నోట్ల మొత్తం విలువ రూ.5000.

అయితే, బాగా కాలిపోయిన, మ్యుటిలేటెడ్ నోట్లను మార్చుకోలేరు. అలాంటి నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ కార్యాలయంలో మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. ఏటీఎం నుంచి బయటకు వచ్చిన మ్యుటిలేటెడ్ నోట్లను మార్చుకోవాలంటే ఎవరి ఏటీఎం నుంచి నోట్లు బయటకు వచ్చాయో బ్యాంకుకు వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్లిన తర్వాత దరఖాస్తు రాయాలి. దీనిలో మీరు డబ్బు విత్‌డ్రా చేయబడిన తేదీ, సమయం, స్థలం గురించి సమాచారాన్ని తెలుపాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు, ఏటీఎం నుంచి లావాదేవీకి సంబంధించిన స్లిప్‌ను కూడా జత చేయాల్సి ఉంటుంది. స్లిప్ ఇవ్వకుంటే మొబైల్‌లో వచ్చిన లావాదేవీ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ నోట్లు బ్యాంకు ద్వారా మార్చబడతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి