AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Privatization of 2 Banks : త్వరలో ఈ 2 బ్యాంకులు ప్రైవేటీకరణ..! ఉద్యోగులు, ఖాతాదారుల పరిస్థితి ఏంటో తెలుసుకోండి..

Privatization of 2 Banks : త్వరలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరించడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

Privatization of 2 Banks : త్వరలో ఈ 2 బ్యాంకులు ప్రైవేటీకరణ..! ఉద్యోగులు, ఖాతాదారుల పరిస్థితి ఏంటో తెలుసుకోండి..
Privatization Of 2 Banks
uppula Raju
|

Updated on: Jun 27, 2021 | 4:35 PM

Share

Privatization of 2 Banks : త్వరలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. అందులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఇందుకోసం కేబినెట్‌ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి ప్యానెల్‌ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో వివిధ నియంత్రణ, పరిపాలనా సమస్యలపై చర్చించిన తరువాత వ్యూహాన్ని రూపొందించారు. మూలాల ప్రకారం.. పెట్టుబడులపై కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీల ప్రైవేటీకరణ కోసం కొన్ని బ్యాంకుల పేర్లు సూచించబడ్డాయి. దీనిపై తుది నిర్ణయం త్వరలో తీసుకోవచ్చు.

నీతి ఆయోగ్ సిఫారసుపై ఉన్నత స్థాయి ప్యానెల్ సమావేశం జూన్ 24 న జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రైవేటీకరణను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ప్యానల్ సమావేశంలో ఈ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల పరిస్థితి ఏంటని చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడానికి తగిన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్యానెల్ వర్గాలు తెలిపాయి.

ఈ ప్యానెల్ సమావేశంలో ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయం, కార్పొరేట్ వ్యవహారాలు, న్యాయ వ్యవహారాల విభాగాల కార్యదర్శులతో పాటు పరిపాలనా శాఖ కార్యదర్శులు ఉన్నారు. ఇది కాకుండా, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం, పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డిపామ్) కార్యదర్శి కూడా సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2021 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించినట్లుగా నీతి ఆయోగ్.. ఏప్రిల్‌లో క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని పెట్టుబడులపై కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీల ప్రైవేటీకరణ కోసం కొన్ని బ్యాంకు పేర్లను సూచించింది. ఇది 1.75 లక్షల కోట్లను వాటా నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Drone Attack: భారత్‌పై తొలి డ్రోన్ దాడి.. వాయుసేన స్థావరాలను టార్గెట్ చేసిన ముష్కరులు

రూ. 50 కోట్లతో అంబేద్కర్ స్మారక మందిరం…. 45 మీటర్ల ఎత్తులో శిలా విగ్రహం… యూపీ ప్రభుత్వ యోచన

యూకేలో మాజీ భార్యకు వాటా ఇవ్వాల్సివస్తుందని ఇల్లు తగులబెట్టుకున్నాడు… కోర్టు ఏ శిక్ష విధిస్తుందో..?