AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఈ స్కీమ్‌లో 1 కోటి మందికి పైగా దరఖాస్తు.. మీరు చేసుకోకుంటే వెంటనే చేసుకోండి

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేశారు. ఈ పథకం కింద

PM Modi: ఈ స్కీమ్‌లో 1 కోటి మందికి పైగా దరఖాస్తు.. మీరు చేసుకోకుంటే వెంటనే చేసుకోండి
Pm Surya Ghar Muft Bijli Yojana
Subhash Goud
|

Updated on: Mar 17, 2024 | 3:50 PM

Share

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేశారు. ఈ పథకం కింద ఇప్పటికీ రిజిస్ట్రేషన్ జరుగుతోంది. మీరు కూడా ఈ పథకం కింద నమోదు చేసుకోవాలనుకుంటే, మీరు దీనికి అర్హులా కాదా, ఉచిత విద్యుత్ పథకం ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకోండి.

రిజిస్ట్రేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని ప్రధాని మోదీ అన్నారు. ఉచిత విద్యుత్ పథకం కింద ఇంకా నమోదు చేసుకోని వారు వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది జీవనశైలిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. పర్యావరణానికి మెరుగైన సహకారం అందిస్తుంది. ఇది శక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు, గృహాలకు విద్యుత్ ఖర్చును కూడా గణనీయంగా తగ్గిస్తుంది.

ఈ స్కీమ్ కు అర్హులెవరు?

ఇవి కూడా చదవండి

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే ఇంటికి సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవడానికి అనువైన పైకప్పు ఉండాలి. ఇది కాకుండా, కుటుంబానికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ కూడా అవసరం. మీరు ఏదైనా ఇతర సోలార్ ప్యానెల్‌పై సబ్సిడీని పొందుతున్నట్లయితే మీరు సబ్సిడీ ప్రయోజనం పొందలేరు.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.inకి వెళ్లి అప్లై ఫర్ రూఫ్‌టాప్ సోలార్ ఎంపికను ఎంచుకోండి.
  • ఇప్పుడు మీ రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ పేరును ఎంచుకోండి. ఆపై మీ విద్యుత్ వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్, ఇమెయిల్‌ను నమోదు చేయండి.
  • వినియోగదారు నంబర్, మొబైల్‌ను నమోదు చేయడం ద్వారా కొత్త పేజీలో లాగిన్ అవ్వండి.
  • ఫారమ్ ఓపెన్‌ అయినప్పుడు దానిలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌ల కోసం దరఖాస్తు చేసుకోండి.

ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీరు సాధ్యత ఆమోదం పొందుతారు. ఆ తర్వాత మీరు మీ డిస్కామ్‌లో రిజిస్టర్ చేయబడిన ఏ విక్రేత నుండి అయినా ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఎంత సబ్సిడీ ఇస్తారు?

ఈ పథకం కింద దరఖాస్తు చేయడానికి మీరు గత ఆరు నెలల విద్యుత్ బిల్లును కలిగి ఉండాలి. కొత్త సోలార్ రూఫ్‌టాప్ పథకం కింద వినియోగదారులకు మూడు కిలోవాట్‌ల వరకు కనెక్షన్‌లకు కిలోవాట్‌కు రూ.30,000, 3 కిలోవాట్‌ల కంటే ఎక్కువ కనెక్షన్‌లకు కిలోవాట్‌కు రూ.18,000 సబ్సిడీ (ఉచిత విద్యుత్ పథకం సబ్సిడీ) ఇవ్వవచ్చని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి