AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ప్రారంభిస్తారంటే..?

Vande Bharat Sleeper Train: దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 17న ప్రధాని మోదీ వెస్ట్ బెంగాల్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు. హౌరా-గౌహతి మధ్య నడిచే ఈ రైలు అత్యాధునిక సౌకర్యాలు, మెరుగైన భద్రతతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు ప్రారంభోత్సవం రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ప్రారంభిస్తారంటే..?
Pm Modi Will Inaugurate India First Vande Bharat Sleeper Train
Krishna S
|

Updated on: Jan 05, 2026 | 7:24 PM

Share

పశ్చిమ బెంగాల్ రైల్వే ముఖచిత్రం మారబోతోంది. దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పశ్చిమ బెంగాల్ గడ్డపై పరుగులు తీయడానికి సిద్ధమైంది. జనవరి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రతిష్టాత్మక రైలును ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును హౌరా నుండి అస్సాంలోని గౌహతి మధ్య నడపనున్నారు. ఈ రైలు ఇతర సూపర్‌ఫాస్ట్ రైళ్ల కంటే చాలా తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకుంటుంది. విమాన తరహాలో అత్యాధునిక ఇంటీరియర్, సౌకర్యవంతమైన బెర్త్‌లు, ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు ఈ రైలు ప్రత్యేకత.

స్లీపర్ రైలుతో పాటు కామాఖ్యకు వెళ్లే మరో కొత్త రైలును కూడా ప్రధాని అదే వేదికపై నుండి ప్రారంభించనున్నారు. జనవరి 17న మాల్డాలోని నిత్యానందపూర్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అమృత్ భారత్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే మాల్డా టౌన్ స్టేషన్ పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. సోమవారం రైల్వే బోర్డు ఛైర్మన్, CEO సతీష్ కుమార్ మాల్డా స్టేషన్‌ను సందర్శించి, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను పర్యవేక్షించారు.

ఎన్నికల వేళ రాజకీయ రంగు

అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ రైళ్ల ప్రారంభోత్సవం బెంగాల్ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ది బెంగాల్ అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న పెద్ద బహుమతిగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రయాణికుల భద్రతపై తృణమూల్ కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇటీవల మంత్రి సబీనా యాస్మిన్ బ్యాగ్ రైలులోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లోనే దొంగతనానికి గురవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. కేవలం కొత్త రైళ్లు ప్రవేశపెడితే సరిపోదని, భద్రత ముఖ్యం అని టీఎంసీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, దేశంలోనే తొలి స్లీపర్ వందే భారత్ బెంగాల్‌కు రావడంపై సామాన్య ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 17 తర్వాత ప్రయాణికులకు ఈ అత్యాధునిక రైలు అందుబాటులోకి రానుంది.