AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: అన్నదాతలకి అలర్ట్‌.. ఈ కేవైసీ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడగింపు..!

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మంగళవారం(మే 31) దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం బహుమతిని అందించింది.

PM Kisan: అన్నదాతలకి అలర్ట్‌.. ఈ కేవైసీ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడగింపు..!
Pm Kisan
uppula Raju
|

Updated on: Jun 01, 2022 | 5:52 PM

Share

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మంగళవారం(మే 31) దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం బహుమతిని అందించింది. 11వ విడత మొత్తాన్ని దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలకు బదిలీ చేసింది . ఇందులో భాగంగా బీహార్‌లోని 82 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేశారు. కానీ ఇందులో కొందరి అకౌంట్లో డబ్బులు జమకాలేదు. ఎందుకంటే వీరు ఈ-కేవైసీ చేయలేదు. అందుకే బిహార్ ప్రభుత్వం జూలై 31 వరకు రైతులు ఈ కేవైసీ చేసుకోవడానికి గడుపు పొడగించింది. ఇంకా ఎవరైనా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ-కేవైసీ చేయని వారు ఉంటే వెంటనే చేసుకోవాలని సూచించింది. అప్పుడే రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి.

ఈ కేవైసీ చేసుకోని రైతుల సంఖ్య దాదాపు 31 శాతంగా ఉంది. డేటా ప్రకారం ఇప్పటివరకు ఈ-కేవైసీ చేయని రైతుల సంఖ్య 25 లక్షలకు పైగా ఉంది. అటువంటి రైతులను దృష్టిలో ఉంచుకుని బీహార్ ప్రభుత్వం ఈ-కేవైసీ తేదీని జూలై 31 వరకు పొడిగించింది. ఈ-కేవైసీ ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు. దీనికి బ్యాంక్ ఖాతా ఆధార్ నంబర్‌తో లింక్ చేసి ఉండాలి. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి రైతులు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ వారు OTP ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

నకిలీ లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ-కేవైసీ

ఇవి కూడా చదవండి

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నకిలీ లబ్ధిదారుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం 10వ విడత సమ్మాన్ నిధిని విడుదల చేసినప్పుడు పెద్ద సంఖ్యలో అనర్హులు డబ్బులు పొందారు. ఈ క్రమంలో అలాంటి వారిని గుర్తించి డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ పథకం కింద ఎటువంటి అవాంతరాలు జరగకూడదని ప్రభుత్వం ఈ-కేవైసీ ని తప్పనిసరి చేసింది. దీని కోసం మే 31 వరకు సమయం కేటాయించింది. కానీ మే 31 వరకు కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఈ-కేవైసీ చేయలేదని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్