Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో లేదో తెలుసుకోండి.. ఎలా చెక్ చెయాలంటే..

PM Kisan Samman Nidhi Yojana: రైతులకు తీపికబురు అందించిన కేంద్రం. మోదీ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా

PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో లేదో తెలుసుకోండి.. ఎలా చెక్ చెయాలంటే..
Pm Kisan Samman Nidhi
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 24, 2021 | 8:42 AM

PM Kisan Samman Nidhi Yojana: రైతులకు తీపికబురు అందించిన కేంద్రం. మోదీ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం. ఇందులో రైతులకు కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు అందిస్తోంది. మోదీ ప్రభుత్వం రైతులకు చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమచేయనుంది. మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున రైతులకు ఈ డబ్బులు అందించనుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటికే 7 విడతల డబ్బులను బ్యాంక్ అకౌంట్లలో జమచేసింది. ఇంకా రైతుల అకౌంట్లలోకి 8వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ డబ్బులను ఈ నెల చివరికల్లా రూ.2 వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే మరీ మీరు పీఎం కిసాన్ స్కీంలో చేరారా ? ఇప్పటి వరకు ఎన్ని విడుదల డబ్బులు మీ అకౌంట్లలోకి వచ్చాయి. ఇప్పడీ.. 8వ విడత డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయా ? రావా ? అనే విషయాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పీఎం కిసాన్ స్కీం వెబ్‏సైట్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ బెనిఫీషియరీ లిస్ట్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి. మీ పేరు ఉంటే మీకు డబ్బులు వస్తాయి. ఒక వేళ మీ పేరు లేకపోతే డబ్బులు రావు.

Also Read: Covid Scare Rising: మీకు కరోనా సోకిందా.. అయితే ఆరోగ్య భీమా ఎంత ఉండాలో తెలుసా..

ఆ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. క్యాష్ విత్ డ్రా, ఎస్ఎంఎస్ చార్జీల పెంపు.. ఎప్పటి నుంచి అంటే..

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? వెంటనే ఇలా లాక్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు…