Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Nitin Gadkari: రూ.15లకే లీటర్‌ పెట్రోల్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి నితిన్‌ గడ్కరీ

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 100 రూపాయల మార్కును దాటడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. గత సంవత్సరం మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి, అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా సుంకాన్ని..

Minister Nitin Gadkari: రూ.15లకే లీటర్‌ పెట్రోల్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి నితిన్‌ గడ్కరీ
Minister Nitin Gadkari
Follow us
Subhash Goud

|

Updated on: Jul 05, 2023 | 8:59 PM

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 100 రూపాయల మార్కును దాటడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. గత సంవత్సరం మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి, అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా సుంకాన్ని తగ్గించడంతో ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా తగ్గలేదు. దీంతో పెట్రోలు-డీజిల్‌ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం పెట్రోలియం కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. రష్యా తదితర దేశాల నుంచి చౌకగా ముడిచమురు తెచ్చుకుని యూరప్ లో విక్రయిస్తోంది. దీని వల్ల కంపెనీలు లబ్ధి పొందుతున్నాయి. ఇంధనంపై పన్నుతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లబ్ధి పొందుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.అలా చేసినట్లయితే లీటరుకు రూ.15 చొప్పున పెట్రోలు లభించే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. బుధవారం రాజస్థాన్‌లోని ప్రతాప్‌గడ్‌లో చౌక పెట్రోల్ గురించి నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు.

రానున్న రోజుల్లో చమురు ధరలు మరింతగా తగ్గే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) నిర్ణయం తీసుకోనున్నాయని, ఈ కంపెనీలు రానున్న కొద్ది నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. గత త్రైమాసికంలో ఈ కంపెనీలు బాగా లాభపడ్డాయి. వచ్చే త్రైమాసికంలో ఈ కంపెనీలు బలమైన ఆధిక్యం సాధిస్తే ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంది.

దేశంలో అతిపెద్ద చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ 52 శాతం నికర లాభాన్ని సాధించింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.10,841 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.7,089 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మార్చి త్రైమాసికంలో 79 శాతం నికర లాభాన్ని నమోదు చేసింది. వచ్చే త్రైమాసికంలో లాభాలు ఉంటే పెట్రోల్-డీజిల్ చౌకగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

గత ఏడాది ఫిబ్రవరి 2022లో రష్యా గత వారంలో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పుడు ధరలు ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర భారీగా పెరిగింది. ముడి చమురు బ్యారెల్‌కు 139 డాలర్లకు చేరుకుంది. 2008 తర్వాత క్రూడాయిల్‌కు ఇదే అత్యధికంగా జంప్ అయ్యింది. దాని ప్రభావం ప్రపంచంపై పడింది. శ్రీలంకతో సహా అనేక చిన్న ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో పడిపోయాయి. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. భారతదేశంలో పెట్రోల్ రూ.110పైనే చేరుకుంది.

పెట్రోల్‌ను ఇంత చౌకగా ఎలా లభిస్తుందో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫార్ములా ఇచ్చారు. దేశంలో భవిష్యత్తులో పెట్రోల్ లీటరుకు రూ.15 చొప్పున మాత్రమే లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనాల్లో 60% ఇథనాల్, 40% విద్యుత్ వాడితే దేశంలో పెట్రోల్ వినియోగం తగ్గుతుంది. దీని కారణంగా భవిష్యత్తులో పెట్రోలు లీటరుకు రూ.15 చొప్పున మాత్రమే లభిస్తుందని ఆయన అన్నారు. దీంతో దేశంలో పెట్రోలు వినియోగం తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి