AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM Jagan: ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను ప్రధాని ముందుంచినట్టు తెలుస్తోంది. ఈ ఆరు నెలల కాలంలో..

AP CM Jagan: ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ
CM Jagan
Subhash Goud
|

Updated on: Jul 05, 2023 | 8:08 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను ప్రధాని ముందుంచినట్టు తెలుస్తోంది. ఈ ఆరు నెలల కాలంలో ప్రధానిని సీఎం జగన్‌ కలవడం ఇది మూడోసారి. విభజన హామీలు, ఆర్థిక సాయం, పెండింగ్‌ అంశాలపై ప్రధానితో చర్చించినట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని సీఎం కోరినట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర సర్కారు చేసిన నిధులను వెంటనే రీయింబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు, జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్దిదారుల గుర్తింపు, 12 మెడికల్‌ కాలేజీలకు అనుమతి, కడప ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం APMDCకి ఇనుప గనుల కేటాయింపుల వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

ఈ మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన సీఎం జగన్‌కు పార్టీ ఎంపీలు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం నేరుగా జన్‌పథ్‌లోని నివాసానికి చేరుకున్నారు. అలాగే మధ్యాహ్నం అమిత్‌ షాతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి వచ్చే ఫండ్స్‌పై జగన్‌ చర్చించినట్లు సమాచారం. హోం మంత్రి, ప్రధానితో భేటీ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఆర్థిక వ్యవహారాలు, బకాయిల గురంచి నిర్మలా సీతారామన్‌కు వివరించినట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..