AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price: ప్రభుత్వ చమురు కంపెనీలకు రూ.18,480 కోట్ల నష్టం.. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా..?

Petrol-Diesel Price: ప్రస్తుతం పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగడం వల్ల ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మొత్తం..

Petrol-Diesel Price: ప్రభుత్వ చమురు కంపెనీలకు రూ.18,480 కోట్ల నష్టం.. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా..?
Indian Oil
Subhash Goud
|

Updated on: Aug 08, 2022 | 6:45 AM

Share

Petrol-Diesel Price: ప్రస్తుతం పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగడం వల్ల ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మొత్తం రూ .18,480 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. మూడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకపోవడంతో వాటి నష్టాలు గణనీయంగా పెరిగాయి. వారి మార్జిన్లు పతనం కావడం వల్ల ఇది జరిగింది. పెట్రోలు, డీజిల్ కాకుండా, దేశీయ LPG మార్జిన్ తగ్గింపు కారణంగా ఈ పెట్రోలియం కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. అటువంటి పరిస్థితిలో నష్టాన్ని భర్తీ చేయడానికి చమురు ధరలు పెంచడంతోనే సాధ్యమవుతుందని చమురు సంస్థలు భావిస్తున్నాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజు ధరను బట్టి సవరించే అధికారం పొందాయి. అయితే పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం ఒత్తిడితో నాలుగు నెలలుగా చమురు ధరలను పెంచలేదు. ఈ సమయంలో అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల కారణంగా ఈ కంపెనీల ఖర్చు కూడా పెరిగింది.

కంపెనీలకు రికార్డు స్థాయిలో నష్టాలు

ఇవి కూడా చదవండి

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.1,995.3 కోట్ల నష్టం వాటిల్లిందని ఐఓసీ గత జూలై 29న వెల్లడించింది. హెచ్‌పిసిఎల్ శనివారం కూడా ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రూ.10,196.94 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అలాగే బీపీసీఎల్ కూడా రూ.6,290.8 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ విధంగా, ఈ మూడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కలిపి ఒక త్రైమాసికంలో మొత్తం రూ.18,480.27 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఇది ఇప్పటివరకు ఏ త్రైమాసికంలో లేని రికార్డు.

వాస్తవానికి, గత కొన్ని నెలలుగా, 7 శాతానికి పైగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రభుత్వానికి సహాయపడటానికి IOC, BPCL, HPCL పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను మార్చలేదు. మొదటి త్రైమాసికంలో ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు US $ 109 వద్ద దిగుమతి చేయబడింది. అయినప్పటికీ, రిటైల్ అమ్మకాల రేట్లు బ్యారెల్‌కు దాదాపు $85-86 వద్ద ఉండగా, చమురు కంపెనీలు బ్యారెల్ ముడి చమురుపై సుమారు $ 23-24 నష్టాన్ని చవిచూశాయి.

ఏప్రిల్ 6 నుంచి ధరలకు బ్రేకులు:

చమురు కంపెనీలకు రిటైల్ ధరలను మార్చుకునే స్వేచ్ఛ ఉందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఏప్రిల్ 6 నుండి రిటైల్ అమ్మకాల రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. ఒక వైపు రాజకీయంగా ముఖ్యమైన ఎన్నికలకు ముందు చమురు ధరలు స్థిరంగా కొనసాగాయి. గత ఏడాది ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మూడు కంపెనీలు రేట్ల సవరణను నిలిపివేశాయి. అలా 137 రోజుల పాటు కొనసాగింది.

మేలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ, రిటైల్ కొనుగోలుదారులు ప్రయోజనం పొందారు. హెచ్‌పిసిఎల్ పెట్రోల్, డీజిల్‌లను లీటర్‌కు రూ. 12-14 నష్టానికి విక్రయించాయని, ఈ త్రైమాసికంలో ఆదాయాలపై ప్రభావం చూపిందని కంపెనీలు పేర్కొంటున్నాయి. దీంతో మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..