Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel Price: పెట్రోలు, డీజిల్‌ మళ్లీ కష్టాలు.. ధరలు మళ్లీ పెరగనున్నాయా..?

భారతదేశంలో ద్రవ్యోల్బణం ఇప్పటికే అధిక స్థాయిలో కొనసాగుతోంది. ఇక పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కొత్త ఆందోళన తెరపైకి వస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు..

Petrol, Diesel Price: పెట్రోలు, డీజిల్‌ మళ్లీ కష్టాలు.. ధరలు మళ్లీ పెరగనున్నాయా..?
Fuel Price
Follow us
Subhash Goud

|

Updated on: Dec 24, 2022 | 6:45 AM

భారతదేశంలో ద్రవ్యోల్బణం ఇప్పటికే అధిక స్థాయిలో కొనసాగుతోంది. ఇక పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కొత్త ఆందోళన తెరపైకి వస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధరలో 5 డాలర్ల వరకు వ్యత్యాసం ఉంది. శుక్రవారం అంతర్జాతీయ ముడి చమురు ధరలో 2 శాతం పెరుగుదల కనిపించింది. రష్యా నుంచి ఎగుమతి అవుతున్న ముడి చమురు తగ్గడం వల్ల ఈ బూమ్ కనిపించింది. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 1.4 డాలర్లు పెరిగి 82.38 డాలర్లకు చేరుకుంది. అమెరికా ముడి చమురు ధర 1.5 డాలర్ల వరకు పెరిగింది.

రష్యా ఎగుమతులు 20% తగ్గాయి

నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో రష్యా బాల్టిక్ చమురు ఎగుమతులు 20 శాతం పడిపోయాయి. యూరోపియన్ యూనియన్, జీ7 దేశాల తాజా ఆంక్షల తర్వాత రష్యా నుంచి వస్తున్న ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు, డిసెంబర్ 5 న రష్యా ముడి చమురు ధరలపై ధర పరిమితి విధించడం జరిగింది. ఇది దాని ఎగుమతులను కూడా ప్రభావితం చేసింది.

ధర పరిమితికి ప్రతిస్పందనగా, రష్యా 2023 ప్రారంభంలో ముడి చమురు ఉత్పత్తిని 5 నుండి 7 శాతం తగ్గించవచ్చు. అదే సమయంలో చైనాలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి దాని డిమాండ్‌ను తగ్గిస్తుంది. దీంతో గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే, మాంద్యం వచ్చే అవకాశం ఉన్నందున, పెట్రోల్, డీజిల్ వాడకంలో తగ్గుదల ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

క్రూడాయిల్ ధర నిరంతరం పెరుగుతోంది

గత వారం రోజులుగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల ట్రెండ్ ను పరిశీలిస్తే.. అందులో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. డిసెంబర్ 19 వారంలో మొదటి రోజు, WTI ముడి చమురు ధర బ్యారెల్‌కు $ 75.89 ఉంది. డిసెంబర్ 23న బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయిని దాటింది. అంటే, దాని ధరలో 7.23 శాతం మార్పు వచ్చింది. అదే సమయంలో, దాని ధరలో దాదాపు 5 డాలర్ల వ్యత్యాసం కనిపించింది.

మే 21 నుండి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. అయితే పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో రూ.21,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కొంతకాలం క్రితం మూడు ప్రభుత్వ చమురు కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. దీనికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, చమురు కంపెనీల నష్టాలతో ఎలాంటి ప్రభావం లేకుండా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతకాలం నిలకడగా ఉంటాయో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..