Rs 2000 Note: మూడేళ్లుగా ఒక్క రూ.2000 నోటు కూడా ముద్రించలేదట

ఆరు సంవత్సరాల క్రితం ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త 2000 నోట్లను విడుదల ..

Rs 2000 Note: మూడేళ్లుగా ఒక్క రూ.2000 నోటు కూడా ముద్రించలేదట
2000 Notes
Follow us

|

Updated on: Nov 10, 2022 | 10:57 AM

ఆరు సంవత్సరాల క్రితం ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త 2000 నోట్లను విడుదల చేసింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నోట్ల రద్దు నిర్ణయం దేశ విదేశాల్లో నేటికీ చర్చనీయాంశంగానే ఉంది. నోట్ల రద్దు తర్వాత 2 వేల రూపాయల నోట్లు చెలామణి అవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆ నోట్ల ముద్రణ కూడా నిలిపివేసినట్లు ఆర్బీఐ తెలిపింది. గత మూడేళ్లలో ఒక్క రూ.2000 నోటు కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

తగ్గుతున్న రూ.2000 నోట్లు:

ఆర్టీఐకి అందిన సమాచారం ప్రకారం.. 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో 2000 రూపాయల కొత్త నోట్లను ముద్రించలేదు. 2016-17 నుంచి 2000 నోట్ల ముద్రణలో భారీ తగ్గిపోయింది. ఆర్టీఐ కింద దాఖలైన అభ్యర్థనకు వచ్చిన సమాధానం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016లో రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత. ఈ రూ. 2,000 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‍బీఐ) తీసుకొచ్చింది. అసలు, నకిలీ నోట్ల మధ్య తేడాను ప్రజలు సులువుగా గుర్తించేలా సెక్యూరిటీ ఫీచర్లతో రూ. 2,000 నోటును రూపొందించింది.

2019-20 నుండి ఈ సంఖ్య భారీగా తగ్గిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2016-17, 2018-19 మధ్య ముద్రించిన అవే నోట్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్నాయి. ఇందులో ప్రజల చేతిలో 2000 నోట్లు చలామణి కావడం చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే 2000 నోట్లు చాలా వరకు బ్యాంకుల వద్ద ఉన్నాయి. మే నెలలో రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం సిస్టమ్‌లోని మొత్తం 2000 నోట్ల విలువ మార్చి 2021 నాటికి 22.6 శాతానికి, మార్చి 2022 నాటికి 13.8 శాతానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 2022 నాటికి వ్యవస్థలోని మొత్తం నోట్లలో 2000 నోట్ల వాటా 1.6 శాతం మాత్రమే. నోట్ల ముద్రణ మూసివేయడం వల్ల ఈ షేర్ మరింత తగ్గుతుందని అంచనా.

ఇవి కూడా చదవండి

2000 నోట్ల ముద్రణ ఎందుకు జరగడం లేదు?

నిజానికి పెద్ద నోట్ల ముద్రణకు ద్రవ్యోల్బణం అతి ముఖ్యమైన కారణం. అదే సమయంలో డీమోనిటైజేషన్ వంటి ఊహించని సందర్భాల్లో కూడా పెద్ద నోట్లు సహాయపడతాయి. ఎందుకంటే అదే విలువ కలిగిన నగదును వేగంగా విత్‌డ్రా చేయడానికి సిస్టమ్ నుండి ఉపసంహరించబడిన నగదు మొత్తాన్ని ముద్రించవలసి ఉంటుంది. స్మాల్ ప్యాక్ ఎకానమీని పరిశీలిస్తే.. ప్రస్తుతం సామాన్యుల షాపింగ్ లో పది, ఇరవై, యాభై రూపాయల లోపు సరుకుల ప్యాకెట్లే ప్రధానం కాబట్టి సరిపడా 100, 500 నోట్లను చలామణిలో ఉంచడం వల్ల పనులు సాగుతున్నాయి. అదే సమయంలో సిస్టమ్‌లోని నోట్లు సరిపోతాయి. అందుకే నగదు కొరత ప్రశ్న లేదు. దీనికి తోడు డిజిటల్ లావాదేవీల ట్రెండ్ పెరిగిపోవడంతో పెద్ద నోట్ల అవసరం కూడా తీరిపోతోంది.

ద్రవ్యోల్బణం, వ్యవస్థలో తగినంత నగదు ఉన్నందున, ప్రభుత్వం ఇప్పుడు కొంత కాలంగా పెద్ద నోట్ల నష్టంపై దృష్టి సారించింది. గతేడాది లోక్‌సభలో నోట్లను ముద్రించకపోవడంపై ప్రభుత్వం సమాచారం ఇస్తూ.. ప్రభుత్వం పెద్ద నోట్ల ముద్రణను నిలిపివేస్తోందని, తద్వారా తమ నిల్వలను, నల్లధనాన్ని అరికట్టవచ్చని బదులిచ్చారు. దీంతో పాటు 2000 నకిలీ నోటుపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

పెద్ద నోట్ల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అనే భయంతో ప్రభుత్వం వాటి ముద్రణను నిలిపివేసింది. ప్రస్తుతానికి, 2000 నోటుకు సంబంధించి తదుపరి వ్యూహాన్ని రిజర్వ్ బ్యాంక్ లేదా ప్రభుత్వం వెల్లడించలేదు. ముందుగా ముద్రించిన 2000 నోట్లు చలామణిలో ఉండొచ్చుగానీ, డేటా ఆధారంగా అయితే రానున్న కాలంలో 2000 నోట్లను జేబులో పెట్టుకునే అవకాశాలు గతంలో కంటే తక్కువగా ఉండటం ఖయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం