New Rules From March 2023: వినియోగదారులకు అలర్ట్.. మార్చి 1 కొత్త రూల్స్‌ ఇవే.. తెలుసుకోకపోతే ఇబ్బందులే..

ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు మారుతుంటాయి. ముఖ్యంగా బ్యాకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలు మారుతుంటాయి...

New Rules From March 2023: వినియోగదారులకు అలర్ట్.. మార్చి 1 కొత్త రూల్స్‌ ఇవే.. తెలుసుకోకపోతే ఇబ్బందులే..
కొత్త నెల వచ్చేసింది. దానితో పాటు మన జేబు ఖాళీ చేసేందుకు న్యూ రూల్స్ కూడా అమలులోకి వచ్చేశాయ్. ముఖ్యంగా బ్యాంకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలలో మార్పులు వచ్చాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
Follow us

|

Updated on: Feb 28, 2023 | 7:22 AM

ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు మారుతుంటాయి. ముఖ్యంగా బ్యాకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలు మారుతుంటాయి. ఇక ఫిబ్రవరి నెల ముగియబోతోంది. మార్చి నెల వస్తోంది. నిబంధనలు మారడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. మరి మార్చి నెలలో ఎలాంటి నిబంధనలు మారనున్నాయో తెలుసుకుందాం.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు:

ప్రతినెల ఒకటో తేదీన ఆయిల్‌ కంపెనీలు గ్యాస్‌ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. మార్చి 1న గ్యాస్‌ సిలిండర్ ధర పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.

బ్యాంకు రుణాలు:

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెంచాయి. అయితే రుణాలను నిర్ణయించే బేస్‌ రేటు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతున్నట్లు ఇప్పటికే బ్యాంకులు ప్రకటించాయి. మరి మార్చి 1 నుంచి కొంత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో సామాన్యులకు మరింత భారం కానుంది.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు:

ఎస్‌బీఐకి చెందిన క్రెడిట్‌ కార్డు విభాగం ఇటీవల ఎస్‌బీఐ కార్డు కొత్త ఛార్జీలను ప్రకటించింది. పెంచిన కొత్త ఛార్జీలు మార్చి 17,2023 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఎవరైనా అద్దె చెల్లింస్తే రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అదనంగా ట్యాక్స్‌ సైతం ఉంటుంది. గతంలో ఈ ఛార్జీ రూ.99గా ఉండేది. ఇప్పుడు డబుల్‌ చేసింది.

ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్:

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అర్హులైన ఈపీఎఫ్‌ ఖాతాదారులకు అధిక పెన్షన్‌ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చింది ఈపీఎఫ్‌వో. దీంతో చందాదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మార్చి 3, 2023 చివరి గడువుగా పేర్కొంది. ఎవరైనా అర్హులుగా ఉంటే గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి.

సోషల్‌ మీడియా ఫిర్యాదులు:

ఇక సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు మూడు ఫిర్యాదులు అప్పీలేట్‌ కమిటీలను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీలు మార్చి 1వ తేదీ నుంచి పని చేయనున్నాయి. ఈ కమిటీలు సోషల్ మీడియాలకు సంబంధించిన ఫిర్యాదులను కేవలం 30 రోజుల్లోనే పరిష్కరించనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈపద్ధతితో శ్రావణ సోమవారం శివయ్యకు అభిషేకం చేయండి అదృష్టం మీ సొంతం
ఈపద్ధతితో శ్రావణ సోమవారం శివయ్యకు అభిషేకం చేయండి అదృష్టం మీ సొంతం
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలుగు విద్యార్థులు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలుగు విద్యార్థులు మృతి
తెలంగాణాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా
తెలంగాణాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా
హిండెన్‌బర్గ్‌ నివేదికపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
హిండెన్‌బర్గ్‌ నివేదికపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
స్కూళ్లలో విద్యా వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
స్కూళ్లలో విద్యా వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
విశాఖలో ఘనంగా కావడి యాత్ర.. గంగాజలంతో పరమ శివుడికి అభిషేకం
విశాఖలో ఘనంగా కావడి యాత్ర.. గంగాజలంతో పరమ శివుడికి అభిషేకం
ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు
Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు కాస్త జాగ్రత్త..
Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు కాస్త జాగ్రత్త..
దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
దేశం కోసం రెండు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఒలింపిక్ విజేత
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..