AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rules From March 2023: వినియోగదారులకు అలర్ట్.. మార్చి 1 కొత్త రూల్స్‌ ఇవే.. తెలుసుకోకపోతే ఇబ్బందులే..

ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు మారుతుంటాయి. ముఖ్యంగా బ్యాకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలు మారుతుంటాయి...

New Rules From March 2023: వినియోగదారులకు అలర్ట్.. మార్చి 1 కొత్త రూల్స్‌ ఇవే.. తెలుసుకోకపోతే ఇబ్బందులే..
కొత్త నెల వచ్చేసింది. దానితో పాటు మన జేబు ఖాళీ చేసేందుకు న్యూ రూల్స్ కూడా అమలులోకి వచ్చేశాయ్. ముఖ్యంగా బ్యాంకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలలో మార్పులు వచ్చాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
Subhash Goud
|

Updated on: Feb 28, 2023 | 7:22 AM

Share

ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు మారుతుంటాయి. ముఖ్యంగా బ్యాకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలు మారుతుంటాయి. ఇక ఫిబ్రవరి నెల ముగియబోతోంది. మార్చి నెల వస్తోంది. నిబంధనలు మారడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. మరి మార్చి నెలలో ఎలాంటి నిబంధనలు మారనున్నాయో తెలుసుకుందాం.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు:

ప్రతినెల ఒకటో తేదీన ఆయిల్‌ కంపెనీలు గ్యాస్‌ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. మార్చి 1న గ్యాస్‌ సిలిండర్ ధర పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.

బ్యాంకు రుణాలు:

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెంచాయి. అయితే రుణాలను నిర్ణయించే బేస్‌ రేటు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతున్నట్లు ఇప్పటికే బ్యాంకులు ప్రకటించాయి. మరి మార్చి 1 నుంచి కొంత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో సామాన్యులకు మరింత భారం కానుంది.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు:

ఎస్‌బీఐకి చెందిన క్రెడిట్‌ కార్డు విభాగం ఇటీవల ఎస్‌బీఐ కార్డు కొత్త ఛార్జీలను ప్రకటించింది. పెంచిన కొత్త ఛార్జీలు మార్చి 17,2023 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఎవరైనా అద్దె చెల్లింస్తే రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అదనంగా ట్యాక్స్‌ సైతం ఉంటుంది. గతంలో ఈ ఛార్జీ రూ.99గా ఉండేది. ఇప్పుడు డబుల్‌ చేసింది.

ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్:

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అర్హులైన ఈపీఎఫ్‌ ఖాతాదారులకు అధిక పెన్షన్‌ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చింది ఈపీఎఫ్‌వో. దీంతో చందాదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మార్చి 3, 2023 చివరి గడువుగా పేర్కొంది. ఎవరైనా అర్హులుగా ఉంటే గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి.

సోషల్‌ మీడియా ఫిర్యాదులు:

ఇక సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు మూడు ఫిర్యాదులు అప్పీలేట్‌ కమిటీలను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీలు మార్చి 1వ తేదీ నుంచి పని చేయనున్నాయి. ఈ కమిటీలు సోషల్ మీడియాలకు సంబంధించిన ఫిర్యాదులను కేవలం 30 రోజుల్లోనే పరిష్కరించనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..