AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Saving Schemes: కొత్త ఏడాదిలో మోడీ సర్కార్ గుడ్‌న్యూస్‌.. ఈ పథకాలలో చేరిన వారికి మరింత ఆదాయం

కొత్త సంవత్సరంలో చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు మంచి అవకాశం రాబోతోంది. డిసెంబర్ 31, 2022న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు మోడీ..

Small Saving Schemes: కొత్త ఏడాదిలో మోడీ సర్కార్ గుడ్‌న్యూస్‌.. ఈ పథకాలలో చేరిన వారికి మరింత ఆదాయం
Small Saving Schemes
Subhash Goud
|

Updated on: Dec 10, 2022 | 7:22 AM

Share

కొత్త సంవత్సరంలో చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు మంచి అవకాశం రాబోతోంది. డిసెంబర్ 31, 2022న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 నాల్గవ త్రైమాసికంలో జనవరి నుండి మార్చి వరకు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. దీనిలో పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన ఎన్‌ఎస్‌సీ, ఉన్నాయి.

ఆర్‌బీఐ వరుసగా ఐదోసారి రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. రెపో రేటును 4 శాతం నుంచి 6.25 శాతానికి పెంచారు. కానీ ప్రభుత్వం అనేక చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచలేదు. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ) 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ అలాగే ఉంటుంది. ఇప్పుడు రెపో రేటును 2.25 శాతం పెంచిన తర్వాత, ఈ పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచవచ్చని భావిస్తున్నారు.

మూడవ త్రైమాసికంలో కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. మెచ్యూరిటీ వ్యవధిని 124 నెలల నుంచి 123 నెలలకు తగ్గించారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటును 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెంచారు. నెలవారీ ఆదాయ ఖాతా పథకంపై 6.6 శాతానికి బదులుగా, పోస్టాఫీసు రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 5.5 శాతానికి బదులుగా 6.7 శాతం, 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 5.5 శాతానికి బదులుగా 5.7 శాతానికి 5.8 శాతం చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరిగింది

ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి బలహీనత, వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా గత ఏడాది కాలంలో ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరిగింది. అయినప్పటికీ ఈ బాండ్లతో అనుసంధానించబడిన ఎన్‌ఎస్‌సీ, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు వాటి వడ్డీ రేట్లను మార్చలేదు. 2011లో గోపీనాథ్ కమిటీ అటువంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రభుత్వ బాండ్ రాబడుల కంటే 25 నుండి 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండాలని సూచించింది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి