AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగులకు బంపరాఫర్.. 365 రోజుల పెయిడ్ లీవ్స్ కు గ్రీన్ సిగ్నల్.. అంతే కాకుండా

ఉద్యోగుల కోసం పలు సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. వారి భద్రత, ఆరోగ్య క్షేమమే లక్ష్యంగా విధానాలనూ సవరిస్తుంటాయి. ఉద్యోగుల శ్రేయస్సు కోసం కొన్ని వెసులుబాట్లూ కల్పిస్తుంటాయి. తాజాగా ఈ-కామర్స్ సంస్థ మీషో(Meesho) మరో అడుగు,,,

ఉద్యోగులకు బంపరాఫర్.. 365 రోజుల పెయిడ్ లీవ్స్ కు గ్రీన్ సిగ్నల్.. అంతే కాకుండా
Employees
Ganesh Mudavath
|

Updated on: Jun 20, 2022 | 5:29 PM

Share

ఉద్యోగుల కోసం పలు సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. వారి భద్రత, ఆరోగ్య క్షేమమే లక్ష్యంగా విధానాలనూ సవరిస్తుంటాయి. ఉద్యోగుల శ్రేయస్సు కోసం కొన్ని వెసులుబాట్లూ కల్పిస్తుంటాయి. తాజాగా ఈ-కామర్స్ సంస్థ మీషో(Meesho) మరో అడుగు ముందుకేసింది. తమ సంస్థ ఉద్యోగులకు వేతనంతో కూడిన365 రోజులు లీవ్ ఇచ్చేందుకు(Paid Leaves) నిర్ణయించుకుంది. ఉద్యోగుల భద్రత, సంక్షేమమే లక్ష్యంగా ‘మీకేర్‌ అనే కార్యక్రమానికి మీషో శ్రీకారం చుట్టింది. అన్‌లిమిటెడ్‌ లీవ్‌ పాలసీ ద్వారా ఉద్యోగులు గరిష్ఠంగా 365 రోజుల వరకు సెలవు తీసుకునేలా నిబంధనలు రూపొందించింది. అంతేకాకుండా ఆ సెలవు కాలంలోనూ డబ్బులు ఇచ్చేందుకు నిర్ణయించింది. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి లేదా వారి కుటుంబంలోని ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురై.. తరచూ చికిత్స అవసరమైన వారి విషయంలో ఈ లీవ్స్ ఇవ్వనున్నారు. అంతే కాకుండా వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకునేందుకూ ఈ లీవ్స్ ను ఉపయోగించుకునేలా సవరణలు చేయడం విశేషం.

సంస్థలో పని చేసే ఉద్యోగి అనారోగ్యానికి గురైతే సెలవు కాలం మొత్తానికి డబ్బులు చెల్లిస్తారు. అయితే ఉద్యోగి ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురై.. వారి కోసం సెలవు పెట్టాల్సిన అవసరం వస్తే మూడు నెలల వరకు 25 శాతం వేతనం అందజేస్తారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీలో 2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ కంపెనీ విలువ 1 బిలియన్‌ డాలర్లకు చేరడంతో యూనికార్న్‌ల జాబితాలో చేరింది. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబాలకు సంపూర్ణ శ్రేయస్సు అందించే లక్ష్యం సాకారమవుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి