AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: నేడు ఎల్‌ఐసీ క్యూ4, వార్షిక ఫలితాల విడుదల.. డివిడెండ్‌ ప్రకటిస్తారా.. లేదా..?

మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ IPOలో పెట్టుబడి పెట్టి మీరు లిస్టింగ్ లాభం పొంది ఉండకపోవచ్చు కానీ.. కంపెనీ ఇప్పుడు డివిడెండ్ చెల్లించాలని ఆలోచిస్తోంది. మార్చి త్రైమాసిక ఫలితాలను కంపెనీ ఈరోజు ప్రకటించనుంది...

LIC IPO: నేడు ఎల్‌ఐసీ క్యూ4, వార్షిక ఫలితాల విడుదల.. డివిడెండ్‌ ప్రకటిస్తారా.. లేదా..?
Lic
Srinivas Chekkilla
|

Updated on: May 30, 2022 | 9:54 AM

Share

మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ IPOలో పెట్టుబడి పెట్టి మీరు లిస్టింగ్ లాభం పొంది ఉండకపోవచ్చు కానీ.. కంపెనీ ఇప్పుడు డివిడెండ్ చెల్లించాలని ఆలోచిస్తోంది. మార్చి త్రైమాసిక ఫలితాలను కంపెనీ ఈరోజు ప్రకటించనుంది. ఎల్‌ఐసి (LIC) తరపున రిజల్ట్ ప్రకటించడమే కాకుండా డివిడెండ్ చెల్లించే నిర్ణయాన్ని బోర్డు తీసుకోవచ్చు. స్టాక్ మార్కెట్‌(Stock Market)కు ఇచ్చిన సమాచారంలో జీవిత బీమా సంస్థ మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ చేసిన ఫలితాలు, త్రైమాసిక ఫలితాలు, కంపెనీ పనితీరుకు సంబంధించిన ఫలితాలను సోమవారం ప్రకటిస్తుంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు డివిడెండ్(Dividend) చెల్లించాలని నిర్ణయించుకుంటే, ఈరోజునే ప్రకటించవచ్చు. ఎల్‌ఐసీ షేర్లు లిస్టింగ్ ధర కంటే 13 శాతం తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాప్ 5.25 లక్షల కోట్లకు చేరువలో ఉంది. ఎల్‌ఐసీ 21 వేల కోట్ల ఐపీఓ చాలా బలహీనంగా ఉంది. ఇది 9 శాతం తగ్గింపుతో మే 17న స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయింది. దీని ఇష్యూ ధర రూ.949. నుంచి రూ.818 స్థాయికి దిగజారింది.

LIC లిస్టింగ్ తర్వాత, DIPAM కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే మాట్లాడుతూ ఊహించని మార్కెట్ పరిస్థితుల కారణంగా దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ LIC బలహీనంగా ప్రారంభమైందని చెప్పారు. దీర్ఘకాలంలో లాభాలు పొందేందుకు ఎల్‌ఐసీ షేర్లను ఉంచుకోవాలని ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. స్టాక్ మార్కెట్‌ను ఎవరూ ఊహించలేరని పాండే అన్నారు. సెకండరీ మార్కెట్‌లో షేర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని, దాని కారణంగా ధర పెరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో భయాందోళనలు నెలకొని ఉన్నాయని, దీని వల్ల భారీ జంప్‌ను ఊహించలేదన్నారు. మనం ముందుకు వెళ్లే కొద్దీ స్టాక్ పెరుగుతుందని ఎల్‌ఐసీ ఛైర్మన్ ఎంఆర్ కుమార్ చెప్పారు. అలాట్‌మెంట్ పొందలేని పాలసీదారులు సెకండరీ మార్కెట్‌లో కొనుగోలు చేస్తారని అన్నారు. DIPAM సెక్రటరీ ఈ అభిప్రాయం కూడా చాలా మంది మార్కెట్ నిపుణుల అభిప్రాయానికి అనుగుణంగా ఉంది. చాలా మంది మార్కెట్ నిపుణులు స్టాక్ హోల్డర్‌లకు పెట్టుబడిని కొనసాగించాలని సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ