AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Market Crash: దలాల్ స్ట్రీట్ లో రక్తకన్నీరు.. లక్షల కోట్ల సంపద ఆవిరి.. అతిపెద్ద పతనం..

Market Crash: గ్లోబల్ ఈక్విటీల్లో భారీ అమ్మకాల ఒత్తిడితో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనంతో ముగిశాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారుల సంపద రూ.7.50 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.

Market Crash: దలాల్ స్ట్రీట్ లో రక్తకన్నీరు.. లక్షల కోట్ల సంపద ఆవిరి.. అతిపెద్ద పతనం..
Stock Market
Ayyappa Mamidi
|

Updated on: Jun 13, 2022 | 5:23 PM

Share

Market Crash: గ్లోబల్ ఈక్విటీల్లో భారీ అమ్మకాల ఒత్తిడితో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనంతో ముగిశాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారుల సంపద రూ.7.50 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. వరుసగా ఏడుసెషన్లలో ఈ రోజు మార్కెట్లు పతనం కావటం ఆరవదిగా ఉంది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 251.84 లక్షల కోట్ల నుంచి రూ.244.26 లక్షల కోట్లకు పడిపోయింది. ఉదయం స్టాక్ మార్కెట్లు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత.. సాయంత్రం ముగింపు సమయానికి బీఎస్ఈ బెంచ్‌మార్క్ సూచీ 1,456 పాయింట్లు నష్టపోయింది. అదేవిధంగా మరో కీలక సూచీ నిఫ్టీ- 50.. 427 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1077 పాయింట్లు, మిడ్ క్యాప్ నిప్టీ 798 పాయింట్ల మేర నష్టపోయాయి. దీనికి అమెరికా మార్కెట్ల ప్రభావమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.  మెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠమైన 8.60 శాతాన్ని తాకటంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను భారీగా పెంచే అవకాశం ఉందని మార్కెట్లలో ఆందోళన పెరుగుతోంది.

ఈ రోజు మార్కెట్ సెషన్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఐటీ షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇవి మార్కెట్లను కిందకు డ్రాగ్ చేశాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు తీవ్రంగా నష్టపోయాయి. ఇండెక్స్ మేజర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బలహీనత కూడా మార్కెట్‌ను కిందకు లాగింది. వీటికి తోడు ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. టీసీఎస్ దాదాపు నాలుగు శాతం క్షీణించగా, టెక్ మహీంద్రా 4.37 శాతం, ఇన్ఫోసిస్ 3.53 శాతం క్షీణించాయి.

మార్కెట్లలో ఆందోళనల నేపథ్యంలో ఇండియా VIX దాదాపు 13 శాతం పెరిగింది. దాదాపు అన్ని సెక్టార్ల షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. చిన్న లాభాల కోసం రిస్క్ తీసుకోకుండా మంచి వ్యాల్యూ స్టాక్స్ లో ఇన్వెస్ట్ మార్కెట్ డిప్ సమయంలో కొనుగోలు చేయాలని ప్రొఫిషియెంట్ ఈక్విటీస్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మనోజ్ దాల్మియా అన్నారు. సెన్సెక్స్ PE మల్టిపుల్ 20x కంటే తక్కువకు పడిపోయిన వెంటనే.. మార్కెట్లు 2-3 సంవత్సరాల దృక్కోణం నుంచి చాలా ఆకర్షణీయంగా కనిపించడం ప్రారంభమవుతాయని ఈక్విటీ మాస్టర్‌లోని రీసెర్చ్ కో-హెడ్ రాహుల్ షా చెప్పారు.