Indian Railways: రైలులో మీ లగేజీ ఎవరైనా దొంగలిస్తే ఏం చేయాలి..? ఇలా చేసి పరిహారం అందుకోండి

ప్రతిరోజూ లక్షల మంది రైల్వేలో ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు ప్రయాణ సమయంలో సామాను, ఇతర వస్తువులను దొంగిలించబడిన సంఘటనలు చాలా..

Indian Railways: రైలులో మీ లగేజీ ఎవరైనా దొంగలిస్తే ఏం చేయాలి..? ఇలా చేసి పరిహారం అందుకోండి
Indian Railways
Follow us

|

Updated on: Dec 03, 2022 | 9:36 PM

ప్రతిరోజూ లక్షల మంది రైల్వేలో ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు ప్రయాణ సమయంలో సామాను, ఇతర వస్తువులను దొంగిలించబడిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే ప్రయాణికుల సామాను దొంగలించబడితే ఏమి చేయాలో మీకు తెలుసా? ఒక ప్రయాణికుడు దొంగలించబడిన తన వస్తువులను తిరిగి పొందడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రయాణికుల సామాను దొంగలించబడినట్లయితే అతను మొదట వెంటనే ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన తర్వాత కూడా స్పందన రాకపోతే భారతీయ రైల్వే ద్వారా పరిహారం ఇవ్వబడుతుంది. దీనిపై మీ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే వస్తువులతో పాటు పరిహారం లభించదని గుర్తించుకోవాలి.

వస్తువుల దొంగతనంపై నియమం ఏమిటి?

రైల్వే వెబ్‌సైట్ ప్రకారం.. రైలు ప్రయాణికుల లగేజీ దొంగలించబడినట్లయితే రైలు కండక్టర్, కోచ్ అటెండెంట్, గార్డు లేదా జీఆర్‌పీ ఎస్కార్ట్‌ను సంప్రదించవచ్చు. ఈ వ్యక్తుల తరపున ఎఫ్‌ఐఆర్ ఫారం ఇవ్వబడుతుంది. దాన్ని పూరించిన తర్వాత అవసరమైన చర్య కోసం మీరు పోలీసు స్టేషన్‌కు పంపబడతారు. మీరు మీ ప్రయాణాన్ని పూర్తి చేయాలనుకుంటే ఏదైనా సహాయం కోసం మీరు ఈ ఫిర్యాదు లేఖను ప్రధాన రైల్వే స్టేషన్‌లలోని ఆర్‌పీఎఫ్‌ సహాయ సిబ్బందికి ఇవ్వవచ్చు. మీరు రైల్వే సామాను కోసం మీ లగేజీని బుక్ చేసి, రుసుము చెల్లించినట్లయితే అప్పుడు లగేజీకి నష్టానికి రైల్వే బాధ్యత వహిస్తుంది. దాని పూర్తి ఖర్చు రైల్వే వైపు నుండి పరిహారంగా అందుతుంది. కానీ సరుకుల బుకింగ్ జరగకపోతే రైల్వే శాఖ కేజీకి రూ.100 చెల్లిస్తుంది.

రైలు ప్రయాణంలో లగేజీ దొంగలించబడిన తర్వాత ప్రయాణికుడు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు నమోదైన తర్వాత రైల్వేశాఖ విచారణ జరుపుతారు. తనిఖీ చేసిన తర్వాత కూడా సరుకులు అందకపోతే ఆ వస్తువులపై రైల్వే శాఖ పరిహారం ఇస్తుంది. అయితే ఈ పరిహారం సామాను విలువకంటే కొంత తక్కువగా ఉండవచ్చు. లేదా విలువ కంటే తక్కువగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..