AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raiways Compensation: రైలు ఆలస్యం కారణంగా పరీక్ష మిస్‌.. విద్యార్థికి రూ.9 లక్షల పరిహారం.. కోర్టు సంచలన తీర్పు!

Raiways Compensation: రైళ్ల ఆలస్యం అనేది సర్వసాధారణం. ప్రతి రైలు కూడా సమయానికి వచ్చింది ఉండదు. కొన్ని రైళ్లు నిమిషాల పాటు ఆలస్యమైతే.. మరి కొన్ని రైలు గంటల తరబడి ఆలస్యమవుతుంటాయి. అయితే రైలు ఆలస్యంగా నడిచినందుకు ఓ విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం ఇవ్వాలని రైల్వేకు కోర్టు ఆదేశించింది..

Raiways Compensation: రైలు ఆలస్యం కారణంగా పరీక్ష మిస్‌.. విద్యార్థికి రూ.9 లక్షల పరిహారం.. కోర్టు సంచలన తీర్పు!
Raiways Compensation
Subhash Goud
|

Updated on: Jan 27, 2026 | 1:45 PM

Share

Raiways Compensation: భారత రైల్వేలో ఏ ఒక్క రైలు కూడా సమయానికి వచ్చింది ఉండదు. అది సూపర్‌ ఫాస్ట్‌ అయినా ఇంకేదైనా కొన్ని నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తుంటాయి. కొన్ని రైళ్లు మాత్రం గంటకుపైగానే ఆలస్యంగా వస్తుంటాయి. అయితే ప్రస్తుతం రైళ్లు ఆలస్యంగా నడవడం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ ఓ రైలు ఆలస్యంగా వచ్చినందుకు ఓ విద్యార్థిని పరీక్ష మిస్‌ అయ్యింది. రైలు ఆలస్యంగా కారణంగా తాను పరీక్ష రాయడం మిస్‌ అయ్యానని ఆ సదరు విద్యార్థిని పోరాటం కొనసాగించింది. ఎట్టకేలకు పోరాటంతో గెలిచింది. ఆమె కోర్టు ద్వారా దావా వేసి భారీ జరిమానా విధించాలని డిమాండ్ చేసింది. చివరికి విద్యార్థిని విజయం సాధించారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైలు ఆలస్యం కారణంగా ఒక విద్యార్థి పరీక్ష రాయలేకపోయింది. రైలు మిస్‌ కావడం వల్ల ఆమె మొత్తం సంవత్సరం వృధా అయింది. బాధిత విద్యార్థిని తన న్యాయవాది ద్వారా రైల్వేలకు గుణపాఠం చెప్పడానికి జరిమానా విధించాలని కోరింది. చాలా సంవత్సరాలుగా సాగిన కేసు తర్వాత వినియోగదారు ఫోరం కోర్టు విద్యార్థి ఆరోపణలు నిజమని నిర్ధారించి రైల్వేలకు గణనీయమైన జరిమానా విధించింది.

ఇది కూడా చదవండి: Business Idea: మతిపోగొట్టే బిజినెస్‌ ఐడియా.. వీటిని సాగు చేస్తే ఇంత లాభమా? లక్షల్లో ఆదాయం!

ఇవి కూడా చదవండి

నిజానికి కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పికోరా బక్ష్ మొహల్లా నివాసి అయిన సమృద్ది అనే విద్యార్థిని బయోటెక్‌లో బీఎస్సీ కోసం సిద్ధమవుతోంది. ఆమె పరీక్షా కేంద్రం లక్నోలోని జయనారాయణ్ పీజీ కళాశాలకు కేటాయించారు. పరీక్ష రాయడానికి విద్యార్థిని బస్తీ నుండి ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ రైలు బుక్ చేసుకుంది. రైలు ఉదయం 11 గంటలకు లక్నోకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఆలస్యం కారణంగా రైలు షెడ్యూల్ కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ ఆమె పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం 12:30 గంటలకు చేరుకుంది. ఫలితంగా ఆమె పరీక్షకు దూరమైంది.

బాధిత విద్యార్థి ఈ విషయాన్ని వినియోగదారుల కమిషన్‌కు తీసుకెళ్లింది. రైల్వేలు దాని పరిణామాలను అనుభవించాల్సి వచ్చింది. జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్/న్యాయమూర్తి అమర్‌జీత్ వర్మ, సభ్యులు అజయ్ ప్రకాష్ సింగ్ రైల్వేలకు జరిమానా విధించి, విద్యార్థికి 910,000 రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. రైల్వేలు పరిహారం చెల్లించడంలో ఆలస్యం చేస్తే చెల్లింపులో 12 శాతం వడ్డీగా చెల్లించాల్సి ఉంటుందని కూడా కోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి: February Bank Holiday: ఫిబ్రవరిలో బ్యాంకు హాలీడేస్‌ ఎన్ని రోజులో తెలుసా?

సమృద్ధి న్యాయవాది ప్రభాకర్ మిశ్రా మాట్లాడుతూ.. ఆమె మే 7, 2018న తన బీఎస్సీ బయోటెక్ పరీక్ష రాయడానికి లక్నో వెళ్లిందని వివరించారు. అయితే రైలు ఆలస్యం కారణంగా ఆమె పరీక్షకు హాజరు కాకపోవడంతో ఆమె మొత్తం సంవత్సరం వృధా అయింది. ఆమె జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో దావా వేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ, జనరల్ మేనేజర్, స్టేషన్ సూపరింటెండెంట్‌లకు నోటీసులు పంపినట్లు చెప్పారు. కానీ ఎటువంటి స్పందన రాకపోవడంతో సెప్టెంబర్ 11, 2018న కోర్టులో దావా వేసినట్లు చెప్పారు.

ఈ కేసు ఏడు సంవత్సరాలకు పైగా కొనసాగింది. కమిషన్ రెండు పక్షాల వాదనలు విన్నది. రైల్వేలు రైలు ఆలస్యానికి కారణమని అంగీకరించాయి. కానీ ఆలస్యానికి కారణాన్ని వివరించలేదు. కోర్టు జరిమానా విధించి, రైల్వేలను 45 రోజుల్లోపు 9 లక్షల 10 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని నిర్ణీత సమయంలోపు వినియోగదారునికి చెల్లించకపోతే వినియోగదారుకు మొత్తం మొత్తానికి 12 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

Auto News: ఈ బైక్‌కు ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే 700 కి.మీ.. తక్కువ ధరల్లోనే.. రికార్డ్‌ స్థాయిలో విక్రయాలు

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి