AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: 10 నిమిషాల్లో సీట్లో కూర్చోవాలి.. లేకుంటే సీటు రద్దు.. రైల్వే కొత్త నిబంధన

చాలా దూరం ప్రయాణించే రైలు ప్రయాణీకులలో చెడు అలవాటు ఉంది. రైలు ప్రారంభ స్టేషన్ నుండి బోర్డింగ్ రిజర్వ్ చేసుకుంటారు. కానీ రెండు లేదా మూడు స్టేషన్లు దాటిన తర్వాత రైలు ఎక్కుతుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి హౌరా లేదా సీల్దా స్టేషన్ నుండి బోర్డింగ్ రిజర్వ్ చేశారని అనుకుందాం.. కానీ అతను బండేల్ లేదా బుర్ద్వాన్ లేదా మరేదైనా స్టేషన్ నుండి రైలు..

Indian Railways: 10 నిమిషాల్లో సీట్లో కూర్చోవాలి.. లేకుంటే సీటు రద్దు.. రైల్వే కొత్త నిబంధన
Indian Railways
Subhash Goud
|

Updated on: Jan 27, 2024 | 3:50 PM

Share

సుదూర రైలులో వెళ్తున్నారా? మీరు బెర్త్ రిజర్వ్ చేసుకున్నారా? మీరు ఏదైనా స్టేషన్ నుండి రైలులో వెళ్లాలని ఆలోచిస్తున్నారా? ఆ రోజులన్నీ ముగిసిపోతున్నాయి. రైల్వే సమయాన్ని లెక్కించబోతోంది. మీరు రైలు ఎక్కాల్సిన ప్రదేశం నుండి 10 నిమిషాలలోపు మీ సీటులో కూర్చోవాలి. లేదంటే మీ బుకింగ్ రద్దు చేయబడవచ్చు. ఈసారి రైల్వే శాఖ ఇలా కఠిన నిబంధనలు రూపొందిస్తోంది. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ అంటే అది రైల్వే. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే ప్రయాణికులు ముందస్తుగానే ఐఆర్‌సీటీసీ ద్వారానో ఇతర ఆన్‌లైన్‌లో, రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌లోనే బుక్‌ చేసుకుంటారు. అయితే ఇండియన్‌ రైల్వే ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకురాబోతోంది.

చాలా దూరం ప్రయాణించే రైలు ప్రయాణీకులలో చెడు అలవాటు ఉంది. రైలు ప్రారంభ స్టేషన్ నుండి బోర్డింగ్ రిజర్వ్ చేసుకుంటారు. కానీ రెండు లేదా మూడు స్టేషన్లు దాటిన తర్వాత రైలు ఎక్కుతుంటారు.  ఉదాహరణకు వ్యక్తి హౌరా లేదా సీల్దా స్టేషన్ నుండి బోర్డింగ్ రిజర్వ్ చేశారనుకుందాం.. కానీ అతను బండేల్ లేదా బుర్ద్వాన్ లేదా మరేదైనా స్టేషన్ నుండి రైలు ఎక్కుతారు. ఇలాంటి అలవాటు చాలా మంది ప్రయాణికుల్లో కనిపిస్తుంది. అయితే ఈ విధానాన్ని మార్చాలని రైల్వే చెబుతోంది.

కొత్త రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు నిర్దేశించిన సమయానికి 10 నిమిషాలలోపు మీ సీటును చేరుకోకపోతే మీరు ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే, నిర్దిష్ట బోర్డింగ్ పాయింట్ తర్వాత టికెట్ చెకర్ 10 నిమిషాలు వేచి ఉంటాడు. మీరు ఇప్పటికీ మీ సీటుకు చేరుకోకపోతే టిక్కెట్ చెకర్ మీ సీటును ఖాళీగా ఉన్నట్లుగా గుర్తిస్తారు.

ఇవి కూడా చదవండి

సుదూర రైళ్లలో చాలా మంది ప్రయాణికులు టికెట్‌లో పేర్కొన్న స్టేషన్‌కు బదులుగా తదుపరి స్టేషన్ నుండి రైలు ఎక్కుతారు. అలాంటప్పుడు ఏ సీటులో ప్రయాణీకులు ఉన్నారో లేదా ఏ సీటు ఖాళీగా ఉందో గుర్తించడంలో టికెట్ తనిఖీ చేసేవారికి సమస్య ఏర్పడుతుందట. అందుకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంటోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి