Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: హైపర్‌లూప్‌ రైలు.. విమానం కంటే స్పీడు.. గంటకు 1200 కి.మీ వేగం!

Indian Railways: వేగవంతమైన ప్రయాణం చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. వేగం పరంగా ఈ రైలు బుల్లెట్ రైలును అధిగమించనుంది. హైపర్‌లూప్ రైలు అత్యధిక వేగంతో సులభంగా ప్రయాణించేలా రూపొందించబడింది..

Indian Railways: హైపర్‌లూప్‌ రైలు.. విమానం కంటే స్పీడు.. గంటకు 1200 కి.మీ వేగం!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 06, 2024 | 7:20 PM

Indian Railways: భారతీయ రైల్వే క్రమంగా పురోగమిస్తోంది. దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కొనసాగుతోంది. త్వరలో బుల్లెట్ రైలు కూడా అందుబాటులోకి రానుంది. త్వరలో హైపర్‌లూప్ రైలు అందుబటులోకి తీసుకువచ్చేందుకు పనులు వేగవంతం అవుతున్నాయి. ఇందుకోసం 410 కి.మీ మేర ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హైపర్‌లూప్ ట్రాక్ వీడియోను షేర్ చేశారు. ఈ ట్రాక్‌ను రైల్వే బృందం, ఐఐటి మద్రాస్ రెండూ అభివృద్ధి చేశాయి.

హైపర్‌లూప్ రైలు అత్యంత వేగవంతమైన రైలు. ఇది ట్యూబ్ వాక్యూమ్ ద్వారా నడుస్తుంది. ఇందులో మాగ్నెటిక్ టెక్నాలజీని ఉపయోగించారు. ట్యూబ్‌లో గంటకు 1100 నుంచి 1200 కి.మీ వేగంతో రైలు నడుస్తుంది. భారతీయ రైల్వే అభివృద్ధి చేస్తున్న హైపర్‌లూప్ రైలు గరిష్ట వేగం గంటకు 600 కి.మీ. దీంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది.

వేగవంతమైన ప్రయాణం చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. వేగం పరంగా ఈ రైలు బుల్లెట్ రైలును అధిగమించనుంది. హైపర్‌లూప్ రైలు 1100 కిలోమీటర్ల వేగంతో సులభంగా ప్రయాణించేలా రూపొందించబడింది. ఈ రైలు ఢిల్లీ – పాట్నా మధ్య దూరాన్ని ఇక గంటలో చేరుకోనుంది.

Train1

దేశంలోనే తొలి హైపర్‌లూప్ రైలు ముంబై-పుణె మధ్య నడపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంబై నుంచి పూణె దూరం కేవలం 25 నిమిషాల్లోనే చేరుతుంది. ప్రస్తుతం రైలులో ఈ రెండు నగరాల మధ్య దూరాన్ని అధిగమించేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. అయితే, ఈ రైలు టిక్కెట్టు విమాన ప్రయాణం మాదిరిగానే ఉండే అవకాశం ఉంది.

హైపర్‌లూప్ రైళ్లు నాన్‌స్టాప్‌గా ప్రయాణించగలవు. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. హైపర్‌లూప్ రైళ్లకు స్టాప్‌లు ఉండే అవకాశం లేదు. హైపర్‌లూప్ రైలు ఆలోచన కొత్తది కాదు. ఈ కాన్సెప్ట్‌ను మొదట 2013లో ఎలోన్ మస్క్ ప్రతిపాదించారు. అతను రెండు అమెరికన్ నగరాలు, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో మధ్య త్వరిత నాన్-స్టాప్ ప్రయాణం కోసం ఈ ఆలోచనతో వచ్చాడు.

ఇది కూడా చదవండి: Women Schemes: మహిళల కోసం మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌.. వారి ఖాతాల్లో రూ.32 వేలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి