AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: దీపావళి పండగ గిఫ్ట్: రైల్వే ఉద్యోగులకు కళ్లు చెదిరే శుభవార్త చెప్పిన మోడీ ప్రభుత్వం.. అదేంటో తెలుసా..?

భారతదేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో ఈ పండుగ సీజన్‌లో దీపావళి కంటే ముందు మోడీ ప్రభుత్వం భారతీయ రైల్వేలోని లక్షలాది మంది ఉద్యోగులకు శుభవార్త..

Indian Railway: దీపావళి పండగ గిఫ్ట్: రైల్వే ఉద్యోగులకు కళ్లు చెదిరే శుభవార్త చెప్పిన మోడీ ప్రభుత్వం.. అదేంటో తెలుసా..?
Indian Railway
Follow us
Subhash Goud

|

Updated on: Oct 02, 2022 | 4:13 PM

భారతదేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో ఈ పండుగ సీజన్‌లో దీపావళి కంటే ముందు మోడీ ప్రభుత్వం భారతీయ రైల్వేలోని లక్షలాది మంది ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజులకు సమానంగా బోనస్ ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రైల్వే శాఖ గతేడాది కూడా తన రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 11.27 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అయితే, ఇందులో RPF/RPSF సిబ్బంది ఉండరు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 11.27 లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారని రైల్వేశాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. దసరా నుండి దీపావళి వరకు ఉద్యోగులకు ఈ బోనస్ ఇవ్వబడుతుంది. ఈ బోనస్ నాన్-గాడ్జెట్ రైల్వే ఉద్యోగులందరికీ అందుబాటులో ఉంటుంది.

ఈ బోనస్ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా పని చేస్తుందని భారతీయ రైల్వే పేర్కొంది. బోనస్ పొందడం ద్వారా ఈ పండుగ సీజన్‌లో షాపింగ్ కోసం ఎంతగానో ఉపయోగపడనుంది. అలాగే ఆర్థిక వ్యవస్థను మరింత పెంచడానికి ఈ పండుగ సీజన్ సహాయపడుతుంది. అదే సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. కరోనా కాలంలో రైల్వేల సరైన నిర్వహణలో రైల్వే ఉద్యోగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో రైల్వే ఉద్యోగులు ఎంతో కృషి చేశారు.

లాక్‌డౌన్‌లో రైల్వేలు కీలక పాత్ర:

ఇవి కూడా చదవండి

దీనితో పాటు రైల్వే ఉద్యోగుల బోనస్‌ను ఆమోదించినందుకు రైల్వే మంత్రి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి రైల్వే కుటుంబం తరపున ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో ఆహారం, బొగ్గు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాలో రైల్వే చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది దేశంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి దోహదపడింది.

రైల్వే మూడవ వందే భారత్ రైలును కూడా ప్రారంభం:

30 సెప్టెంబర్ 2022న గుజరాత్‌లోని గాంధీనగర్ నుండి ముంబై మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలో ఇది మూడో వందే భారత్ రైలు. ఈ రైలు మహారాష్ట్రలోని గాంధీనగర్, ముంబై సెంట్రల్ మధ్య ప్రయాణిస్తుంది. దేశంలోనే తొలి వందే భారత్ రైలు ఢిల్లీ నుంచి బనారస్ మధ్య, రెండో రైలు ఢిల్లీ నుంచి కత్రా మధ్య నడుస్తోంది. వందే భారత్ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఈ రైలు రాబోయే రోజుల్లో భారతీయ రైల్వేలకు గేమ్ ఛేంజర్‌గా మారనుంది. ఇది భారతీయ రైల్వే సాధించిన అతిపెద్ద విజయం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి