AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Post Payments Bank: క్యాష్‌ డిపాజిట్‌, విత్‌డ్రా చేసే కస్టమర్లకు అలర్ట్‌.. ఛార్జీల బదుడు.. జనవరి 1 నుంచి అమలు

India Post Payments Bank: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్యాంకింగ్‌ రంగంలో కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ నిబంధల ప్రకారం కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి...

India Post Payments Bank: క్యాష్‌ డిపాజిట్‌, విత్‌డ్రా చేసే కస్టమర్లకు అలర్ట్‌.. ఛార్జీల బదుడు.. జనవరి 1 నుంచి అమలు
Subhash Goud
|

Updated on: Dec 22, 2021 | 12:58 PM

Share

India Post Payments Bank: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్యాంకింగ్‌ రంగంలో కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ నిబంధల ప్రకారం కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఇక ఇండియా పోస్ట్ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఖాతా ఉన్న వారు వచ్చే ఏడాది నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసినా, డిపాజిట్‌ చేసినా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. డబ్బుల ఉపసంహరణ, డిపాజిట్‌ లావాదేవీలపై ఛార్జీలు ఉంటాయని ఇండియా పేమెంట్‌ బ్యాంక్‌ తెలిపింది. పరిమితి దాటితే ఛార్జీలు ఉంటాయని వెల్లడించింది.

అయితే ఈ ఛార్జీలు అందరికి ఒకేలా ఉండవు. వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతా ఉన్నవారికి నెలకు నాలుగు సార్లు డబ్బులను ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉపసంహరించకోవచ్చు. కానీ ఆ తర్వాత డబ్బులు ఉపసంహరించుకుంటే ఛార్జీలు తప్పవు. మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 లావాదేవీకి ముట్టజెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఖాతా ఉన్నవారు క్యాష్‌ డిపాజిట్‌ చేసుకోవడం ఉచితం. ఎలాంటి ఛార్జీలు ఉండవు.

ఇతర పొదుపు ఖాతాలున్నవారు నెలకు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇది పూర్తిగా ఉచితం. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే మొత్తం 0.50 శాతం లేదా కనీసం రూ.25 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతా కలిగిన వారు రూ.10వేల వరకు క్యాష్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ రూ.10వేలకుపైగా డిపాజిట్‌ చేసుకుంటే 0.50 శాతం లేదా రూ.25 ప్రతి లావాదేవీకి ఛార్జీలు ఉంటాయి. ఈ నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కస్టమర్ల ఈ విషయాలను గమనించడం తప్పనిసరి. లేకుంటే ఎక్కువ విత్‌డ్రాలు చేసుకుంటే అదనంగా ఛార్జీల బదులు తప్పనిసరి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Swiggy, Zomato: 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్న ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. కస్టమర్లపై భారం పడుతుందా..?

LIC Jeevan Umang Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే స్కీమ్‌.. రూ.44 పెట్టుబడితో 27 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు