Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IMF Data: ఐదవ అతిపెద్ద దేశంగా భారత్.. గత పదేళ్లలో జీడీపీ రెట్టింపు..!

భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ముందంజలోనే ఉంది. ఈ క్రమంలో FY25లో భారతదేశ GDP వృద్ధి గత 10 సంవత్సరాలలో రెట్టింపు అయింది. జర్మనీ, జపాన్ తర్వాత ప్రపంచంలో GDP పరంగా ఐదవ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది.

IMF Data: ఐదవ అతిపెద్ద దేశంగా భారత్.. గత పదేళ్లలో జీడీపీ రెట్టింపు..!
India Gdp
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 23, 2025 | 7:18 PM

భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ముందంజలోనే ఉంది. ఈ క్రమంలో FY25లో భారతదేశ GDP వృద్ధి గత 10 సంవత్సరాలలో రెట్టింపు అయింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 4.3 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విడుదల చేసిన డేటాలో ఈ సమాచారం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడం వల్ల, భారతదేశ GDP 2025లో జపాన్, 2027లో జర్మనీ కంటే ముందు వరుసలో నిలవనుంది. IMF డేటా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఇది విధాన సంస్కరణలు, బలమైన ఆర్థిక వృద్ధి కారణంగా పేర్కొంది.

గత 10 సంవత్సరాలలో భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (GDP)ని రెట్టింపు చేసి 105 శాతం వృద్ధిని నమోదు చేసిందని IMF డేటా తెలిపింది. 2015లో 2.1 ట్రిలియన్ డాటర్ల నుండి 2025లో 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గతంలో పోల్చితే, అదే కాలంలో అమెరికా 66 శాతం, చైనా GDP 44 శాతం పెరిగాయి. దీంతో, భారతదేశం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ (30.3 ట్రిలియన్ డాలర్లు), చైనా (19.5 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4.9 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.4 ట్రిలియన్ డాలర్లు) తర్వాత ప్రపంచంలో GDP పరంగా ఐదవ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. IMF డేటా ప్రకారం, గత దశాబ్దంలో జపాన్ GDP సున్నాగా పెరగడంతో, భారతదేశం త్వరలో జపాన్‌ను అధిగమించనుంది. గత దశాబ్దంలో యునైటెడ్ కింగ్‌డమ్ జీడీపీ 28 శాతం వృద్ధి చెందగా, ఫ్రాన్స్ జీడీపీలో 38 శాతం వృద్ధిని సాధించింది. 2015లో 2.4 ట్రిలియన్ డాలర్ల నుండి 2025 నాటికి 3.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 50 శాతం కంటే ఎక్కువ GDP వృద్ధిని సాధించిన ఇతర అగ్ర ఆర్థిక వ్యవస్థలు రష్యా (57 శాతం), ఆస్ట్రేలియా (58 శాతం), స్పెయిన్ (50 శాతం)గా ఉన్నాయి. భారతదేశ GDP వృద్ధిని అపూర్వమైన రేటుతో చూపిస్తున్న IMF డేటాను బిజెపి మంత్రి అమిత్ మాల్వియా తన అధికారిక X పోస్ట్ ద్వారా పంచుకున్నారు.

ఈ వృద్ధి వేగం భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక సూపర్ పవర్‌గా నిలబెట్టింది. 2025 నాటికి జపాన్‌ను, 2027 నాటికి జర్మనీని అధిగమిస్తుందని బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ అసాధారణ విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి, ఆయన ప్రభుత్వ అవిశ్రాంత కృషికి నిదర్శనమని మాల్వియా పేర్కొన్నారు. చురుకైన ఆర్థిక విధానాలు, సాహసోపేతమైన నిర్మాణాత్మక సంస్కరణలు, వ్యాపారాన్ని సులభతరం చేయడంపై అవిశ్రాంత దృష్టి ద్వారా, మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మార్చింది.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మునుపటి ఏ ప్రభుత్వం సాధించని విజయం ఇది అని అమిత్ మాలవ్య అన్నారు. మార్చి నెల ప్రారంభంలో, భారతదేశం వివేకవంతమైన విధానాలను ప్రశంసిస్తూ, IMF కార్యనిర్వాహక బోర్డు, దేశం బలమైన ఆర్థిక పనితీరు 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడానికి కీలకమైన సంస్కరణలను స్వీకరించడంలో సహాయపడుతుందని పేర్కొంది. అధిక-నాణ్యత ఉద్యోగాలను సృష్టించడానికి, దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్మాణాత్మక సంస్కరణలు చాలా కీలకమని IMF కార్యనిర్వాహక బోర్డు పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..