AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: మోదీ పాలనలో ఇన్‌కమ్ ట్యాక్స్ మ్యాజిక్.. పదేళ్లల్లో ఐదు రెట్ల పెరుగుదల

భారతదేశంలో ప్రజలు నిర్ణీత ఆదాయాన్ని దాటి సంపాదిస్తే వారి ఆదాయానికి అనుగుణంగా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే గతంలో పన్ను చెల్లింపుల ద్వారా రాబడి అనేది చాలా తక్కువగా ఉండేది. క్రమేపి పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా పన్ను చెల్లింపులు అనేవి వేగవంతమయ్యాయి. అయితే తాజాగా మోడీ పదేళ్ల పాలనలో ట్యాక్స్ మ్యాజిక్ పన్ను చెల్లింపుదారులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ నేపథ్యంలో పదేళ్ల మోదీ పాలనలో పన్ను చెల్లింపుదారుల మెరుగుదల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Income Tax: మోదీ పాలనలో ఇన్‌కమ్ ట్యాక్స్ మ్యాజిక్.. పదేళ్లల్లో ఐదు రెట్ల పెరుగుదల
Income Tax
Nikhil
|

Updated on: Nov 14, 2024 | 12:22 PM

Share

సాధారణంగా మధ్య తరగతి ప్రజలు అంటే సంవత్సరానికి రూ.20 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారని అర్థం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని పదేళ్ల ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే రూ. 50 లక్షలు దాటి వార్షికాదాయం ఉన్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని వెల్లడైంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ డేటా ప్రకారం 2023-24లో రూ. 50 లక్షలకు పైగా వార్షిక ఆదాయాన్ని చూపుతున్న వ్యక్తుల సంఖ్య 2013-14లో 1.85 లక్షల నుంచి ఐదు రెట్లు పెరిగి 9.39 లక్షలకు పెరిగింది. అలాగే రూ. 50 లక్షలకుపైగా సంపాదిస్తున్న వారి ఆదాయపు పన్ను బాధ్యత 3.2 రెట్లు పెరిగిందని, 2014లో పన్ను చెల్లింపులు రూ. 2.52 లక్షల కోట్లుగా ఉంటే 2024 నాటికి రూ. 9.62 లక్షల కోట్లకు చేరుకుందని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశానికి లభించే ఆదాయపు పన్నులో 76 శాతం ఈ వర్గాల నుంచే వస్తుందని నిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా మోదీ పాలనలో ఆదాయపు పన్ను చట్టంలో తెచ్చిన కీలక సంస్కరణలతో పాటు బ్లాక్ మనీ విషయంలో తీసుకున్న కఠిన చర్యల కారణంగా ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగిందని పేర్కొంటున్నారు. 2014లో సంవత్సరానికి రూ. 2 లక్షలకు పైగా సంపాదిస్తున్న వ్యక్తులు ఆదాయపు పన్ను చెల్లించాల్సి వచ్చేదని, మోదీ ప్రభుత్వం ప్రకటించిన వివిధ మినహాయింపులతో పాటు తగ్గింపుల కారణంగా రూ. 7 లక్షల వరకు సంపాదించే వ్యక్తులు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ విధానాలు పన్ను చెల్లింపుదారులను ఆకట్టుకున్నాయని పేర్కొంటున్నారు.

రూ. 10 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల నుంచి ఆదాయపు పన్ను వసూలు శాతం 2014లో చెల్లించిన మొత్తం పన్నులో 10.17 శాతం నుంచి 2024 నాటికి 6.22 శాతానికి తగ్గింది. రూ. 2.5 నుంచి రూ.7 లక్షల మధ్య సంపాదిస్తున్న వారి ఆదాయపు పన్ను బాధ్యత 2023-24లో సగటున రూ.43,000గా ఉంది. ఇది వారి ఆదాయంలో దాదాపు 4-5 శాతంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం పది సంవత్సరాల వ్యవధిలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత రూ. 10-20 లక్షల శ్రేణిలో సంపాదిస్తున్న వారిపై పన్ను చెల్లింపు బాధ్యత దాదాపు 60 శాతం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను రిటర్న్ ల సంఖ్య 2013-14లో 3.60 కోట్ల నుంచి 2023-24 నాటికి 7.97 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 121 శాతం పెరుగుదల నమోదైందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..