AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Ticket Cancellation: రైలు టికెట్ల రద్దుకూ చార్జీలుంటాయని తెలుసా? ఏ టికెట్టుకు ఎంత కట్‌ చేస్తారో తెలుసుకోండి..

తీరా రిజర్వేషన్‌ కన్‌ ఫర్మ్‌ అయిన తర్వాత మన ప్రోగ్రాం మారడమే.. లేక క్యాన్సిల్‌ అవడమే జరుగుతుంది. ఆ సమయంలో రైలు టికెట్‌ రద్దు చేయడానికి ప్రయత్నిస్తాం. అయితే ఇలా టికెట్‌ రద్దు చేయాలంటే కొత్త మొత్తాన్ని చార్జ్‌గా రైల్వే శాఖ వసూలు చేస్తుంది.

Train Ticket Cancellation: రైలు టికెట్ల రద్దుకూ చార్జీలుంటాయని తెలుసా? ఏ టికెట్టుకు ఎంత కట్‌ చేస్తారో తెలుసుకోండి..
Train
Madhu
|

Updated on: May 06, 2023 | 11:30 AM

Share

పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ సమయంలో కుటుంబాలుగా టూర్లు ప్లాన్‌ చేస్తూ ఉంటారు. సాధారణంగా రైళ్లలో ప్రయాణం చేయాల్సి వస్తే కనీసం నెల రోజుల ముందుగానే టికెట్లు బుక్‌ చేయాల్సి వస్తుంది. తీరా రిజర్వేషన్‌ కన్‌ ఫర్మ్‌ అయిన తర్వాత మన ప్రోగ్రాం మారడమే.. లేక క్యాన్సిల్‌ అవడమే జరుగుతుంది. ఆ సమయంలో రైలు టికెట్‌ రద్దు చేయడానికి ప్రయత్నిస్తాం. అయితే ఇలా టికెట్‌ రద్దు చేయాలంటే కొత్త మొత్తాన్ని చార్జ్‌గా రైల్వే శాఖ వసూలు చేస్తుంది. టికెట్‌ కన్‌ఫర్మ్‌ లేదా ఆర్‌ఏసీ లేదా వెయిటింగ్‌ లిస్ట్‌ ఎలా ఉన్నా కొంత మొత్తాన్ని డిడక్ట్‌ చేసుకుని మిగిలినది రీఫండ్‌ చేస్తారు. అసలు ఈ చార్జీలు ఎందుకు వసూలు చేస్తారు. ఎంత వసూలు చేస్తారు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పలు రకాలుగా చార్జీలు..

ట్రైన్‌ టికెట్‌ రద్దుకు సంబంధించిన చార్జీలు పలు రకాలుగా ఉంటుంది. మీరు టికెట్‌ తీసుకున్న క్లాస్‌ ని బట్టి, అలాగే మీ ప్రయాణ తేదికి ఎంత సమయం ముందు టికెట్‌ను రద్దు చేసుకున్నారు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని చార్జీలు వసూలు చేస్తారు.

చార్జీలు ఇలా..

  • రైలు బయలుదేరడానికి 48 గంటల కన్నా ముందే రద్దు చేసుకుంటే.. ఏసీ ఫస్ట్/ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికులకు ఒక్కో ప్రయాణీకునికి రూ. 240 ఫ్లాట్ క్యాన్సిలేషన్ చార్జీలు ఉంటాయి.ఏసీ 2-టైర్/ ఫస్ట్ క్లాస్ కోసం రూ. 200, ఏసీ 3-టైర్/ఏసీ చైర్ కారు, ఏసీ-3 ఎకానమీలో అయితే రూ.180, సెకండ్‌ క్లాస్‌కి రూ. 60 చార్జ్ గా వసూలు చేసి మిగిలినది రీఫండ్ చేస్తారు.
  • రైలు బయలుదేరడానికి 48 గంటల నుంచి 12 గంటల ముందు టికెట్‌ రద్దు చేసుకుంటే.. మొత్తం ఛార్జీలో 25% డిడక్ట్ అవుతుంది.
  • రైలు బయలుదేరే సమయానికి 12 గంటల నుంచి 4 గంటల ముందు టికెట్లు రద్దు చేసుకుంటే.. అప్పుడు చార్జీలు టికెట్‌ రేటులో 50శాతం ఉంటాయి. అవి కూడా ప్రతి క్లాస్‌ కి ఫ్లాట్‌ క్యాన్సిలేషన్‌ చార్జి కి లోబడి ఉంటాయి.
  • రైలు బయలు దేరే అరగంట ముందు కూడా టికెట్లు రద్దు చేసుకోవచ్చు. కాకపోతే టికెట్ కన్ఫర్మ్ కాకుండా ఆర్‌ఏసీ/వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న వారు టికెట్‌ రద్దు చేసుకోవచ్చు. అలాంటి వారికి కేవలం కర్కేజ్‌ చార్జీ వసూలు చేసి, మిగిలిన మొత్తాన్ని రీఫండ్‌ చేస్తారు.

ఆదాయంలో వ‌ృద్ధి..

భారతీయ రైల్వేలు 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి-తొమ్మిది నెలలో ప్రయాణికుల కేటగిరీలో అంచనా వేసిన ఆదాయం రూ. 48,913 కోట్లకు పెరిగింది. కిందటి ఏడాది కాలంలో వసూలైన మొత్తం రూ. 28,569 కోట్ల కంటే ఇది 71% అధికం. అలాగే ఏప్రిల్ 1 నుంచి 31 డిసెంబర్ 2022 వరకు రిజర్వ్ చేయబడిన ప్యాసింజర్ సెగ్మెంట్‌లో బుక్ చేసిన సుమారు మొత్తం ప్రయాణీకుల సంఖ్య రూ. 59.61 కోట్లుగా ఉంది , గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 56.05 కోట్లు. అంటే ఇది కూడా 6% పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..