Crypto Currency Bill: ఈ సమావేశాల్లో క్రిప్టోకరెన్సీపై బిల్లు వచ్చే అవకాశం లేదు.. ప్రభుత్వం ఏం చేయబోతోంది?
ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీపై బిల్లు వచ్చే అవకాశం లేదు. ఈ అంశంపై ఇంకా చాలా చర్చలు జరగాల్సి ఉంది.

Crypto Currency Bill: ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీపై బిల్లు వచ్చే అవకాశం లేదు. ఈ అంశంపై ఇంకా చాలా చర్చలు జరగాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. క్రిప్టో బిల్లు పూర్తిగా చర్చించి, పరిగణించబడే వరకు రాదు. క్రిప్టో విషయంలో ప్రభుత్వం ఎలాంటి తొందరపడడం లేదని వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు ఈ బిల్లును వర్షాకాల సమావేశాల్లోనూ చేర్చారు. అప్పుడు కూడా ఇది ఆగిపోయింది. క్రిప్టోకరెన్సీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పలువురు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు ఆర్బీఐ కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దీనిని పెద్ద ముప్పుగా అభివర్ణించారు.
క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి
ఇది 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో మొదలైంది. ఆ సమయంలో బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయింది. 2009లో, జపాన్ శాస్త్రవేత్త సతోషి నకమోటో బిట్కాయిన్ను కనుగొన్నారు. అప్పట్లో అది ఏమిటో ఎవరికీ తెలియదు. అప్పుడు దానిని క్రిప్టో కరెన్సీ అని పిలిచేవారు. క్రిప్టో అంటే గ్రీకు భాషలో రహస్యం. ఇప్పుడు ప్రపంచంలో 8 వేలకు పైగా క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి.వీటిలో ప్రసిద్ధమైనది బిట్కాయిన్.
క్రిప్టో నిరోధించడానికి ప్రభుత్వ సన్నాహాలు ఏమిటి
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటే, డిసెంబర్ 23న ముగిసే శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టె అవకాశం లేదు. పార్లమెంటు ఉభయ సభల ఎజెండాలో బిల్లు ప్రస్తావన లేదు. ఆ వర్గాల సమాచారం ప్రకారం, క్రిప్టోకరెన్సీ బిల్లుపై అవసరమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఇంకా నియంత్రణ నిబంధనలను ఖరారు చేస్తోంది.
అసలు ప్రభుత్వం ముందున్న సమస్య ఏమిటి
క్రిప్టోకరెన్సీ- అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021 నియంత్రణపై పరిశ్రమలో వివాదం ఉంది. భారతదేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బిల్లుకు సంబంధించి లోక్సభ వెబ్సైట్లో వ్యాఖ్య దీనికి కారణం. కానీ, సాంకేతికతను.. దాని వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ఇందులో కొన్ని మినహాయింపులు అనుమతించారు. ఇటీవలి రోజుల్లో, దేశంలోని ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు గణనీయమైన అస్థిరతను చూశాయి. ఎందుకంటే, పెట్టుబడిదారులు నియంత్రణపై స్పష్టమైన చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Paytm Shares: పేటీఎం షేర్ల ధరలలో పతనం..పదివేల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు.. ఎందుకిలా?
SBI Interest Rate: వినియోగదార్లకు ఎస్బీఐ షాక్.. వడ్డీ రేటును పెంచిన బ్యాంక్.. ఎంత పెరిగిందంటే..



