Paytm Shares: పేటీఎం షేర్ల ధరలలో పతనం..పదివేల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు.. ఎందుకిలా?

దేశంలోని ప్రసిద్ధ సంస్థ పేటీఎం(Paytm) మాతృ సంస్థ అయిన వన్97 (One97) కమ్యూనికేషన్స్ షేర్‌లో భారీ క్షీణత ఉంది.

Paytm Shares: పేటీఎం షేర్ల ధరలలో పతనం..పదివేల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు.. ఎందుకిలా?
Paytm Share Price
Follow us

|

Updated on: Dec 15, 2021 | 4:22 PM

Paytm Shares: దేశంలోని ప్రసిద్ధ సంస్థ పేటీఎం(Paytm) మాతృ సంస్థ అయిన వన్97 (One97) కమ్యూనికేషన్స్ షేర్‌లో భారీ క్షీణత ఉంది. ఈ కంపెనీలో యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పీరియడ్ బుధవారంతో ముగిసిందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ మాటల్లో చెప్పాలంటే, పెద్ద పెట్టుబడిదారులు ఇప్పుడు తమ షేర్లను విక్రయించవచ్చు. అందుకే స్టాక్ క్షీణించింది. బుధవారం ఈ షేరు 13 శాతం పడిపోయింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లింది.

యాంకర్ ఇన్వెస్టర్లకు Paytmలో 5.9% లేదా దాదాపు 3.83 కోట్ల షేర్లు ఉన్నాయి. అక్టోబర్ 2021 నాటికి, కంపెనీ షేర్లలో దాదాపు 76 శాతం ప్రజల మధ్య ట్రేడింగ్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. యాంకర్ లాక్-ఇన్ ప్రారంభ తేదీ అంటే ఈ రోజు(December 15, 2021) ఈ స్టాక్ అమ్మకాల ఒత్తిడిని చూసింది.

అంతకుముందు, లిస్టింగ్ రోజు అంటే నవంబర్ 22, పేటీఎం(Paytm) స్టాక్ 27 శాతం పడిపోయింది. స్టాక్ దాని ఇష్యూ ధర రూ. 2,150 నుంచి 9 శాతం తగ్గింపుతో జాబితా అయింది. మొదటి రెండు ట్రేడింగ్ రోజులలో దాని మార్కెట్ క్యాప్‌లో దాదాపు 40 శాతం క్లియర్ అయింది. పేటీఎంఐపీవో(IPO) భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవో. ఐపీవో ద్వారా కంపెనీ రూ.18300 కోట్లు సమీకరించింది. దీని తర్వాత యాంకర్ ఇన్వెస్టర్లకు లాకిన్ పీరియడ్ ఫిక్స్ చేయడం జరిగింది.

పెట్టుబడిదారులు ఇప్పుడు ఏమి చేయాలి?

రానున్న కొద్ది రోజుల పాటు స్టాక్‌లో క్షీణత కొనసాగవచ్చని ఎస్కార్ట్ సెక్యూరిటీ రీసెర్చ్ హెడ్ ఆసిఫ్ ఇక్బాల్ చెప్పారు. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు స్టాక్‌లోనే ఉండాలి. ప్రతి పతనంలో స్టాక్‌ను కొనుగోలు చేయడం మంచిదని ఆయన సూచిస్తున్నారు. కంపెనీకి ఉన్న అతిపెద్ద సమస్య లాభాలేనని ఆసిఫ్ చెప్పారు. షేరు ధర రూ. 1000 కంటే తక్కువగా ఉంటే, స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని ఆయన అంటున్నారు.

పేటీఎం ఆదాయం

కంపెనీ విడుదల చేసిన సమాచారం ప్రకారం జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో కంపెనీ ఆదాయం 64 శాతం పెరిగి రూ.1090 కోట్లకు చేరుకుంది. పేటీఎం(Paytm) లిస్టింగ్ తర్వాత మొదటిసారిగా తన ఆదాయాలను పబ్లిక్‌గా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో 437 కోట్లతో పోలిస్తే 473 కోట్ల ఆదాయంతో నష్టాన్ని కలిగి ఉంది. ఖర్చులు ఏడాది క్రితం ఉన్న 1,170 కోట్ల నుంచి 1,600 కోట్లకు పెరిగాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు