AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు హైదరాబాద్‎లో తులం ఎంతంటే..

బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. అయితే బంగారం ధర రోజుకో విధంగా మారుతూ వస్తోంది. గత నెలలో ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఈమధ్య కాలంలో క్రమంగా క్షీణిస్తున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం.

Gold Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు హైదరాబాద్‎లో తులం ఎంతంటే..
Gold Price
Srikar T
|

Updated on: Jan 27, 2024 | 6:13 AM

Share

బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. అయితే బంగారం ధర రోజుకో విధంగా మారుతూ వస్తోంది. గత నెలలో ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఈమధ్య కాలంలో క్రమంగా క్షీణిస్తున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, హమాస్ యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.62,950 కాగా ఈరోజు తులంపై రూ.100 పెరిగి రూ.63,050 వద్ద కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,700 ఉండగా ఈరోజు తులంపై రూ. 100 పెరిగి రూ.57,800 కు చేరింది.. అంటే నిన్నటి ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 77,500 కాగా ఈరోజు కిలోపై రూ. 500 పెరిగి రూ. 78,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 63,050
  • విజయవాడ..రూ. 63,050
  • ముంబాయి..రూ. 63,050
  • బెంగళూరు..రూ. 63,050
  • చెన్నై..రూ. 63,710

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 57,800
  • విజయవాడ..రూ. 57,800
  • ముంబాయి..రూ. 57,800
  • బెంగళూరు..రూ. 57,800
  • చెన్నై..రూ.58,400

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 78,000
  • విజయవాడ..రూ. 78,000
  • చెన్నై..రూ. 78,000
  • ముంబాయి..రూ. 76,500
  • బెంగళూరు..రూ. 73,500

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..