AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం బంగారం ఎంతంటే..

బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి కొనుగోలు చేసే వారికి నిన్న మొన్నటి వరకూ ధరలు బెంబేలెత్తిస్తున్నప్పటికీ ఈరోజు ధరలు పెరుగకపోవడం కాస్త ఊరట కల్గించే అంశంగా చెప్పవచ్చు. సాధారణంగా బంగారం ధరలు పెరుగు,తగ్గుదలకు అంతర్జాతీయంగా డాలర్ విలువ ప్రదాన కారణం. ఇది ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది.

Gold Price: స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం బంగారం ఎంతంటే..
Gold Price
Srikar T
|

Updated on: Jan 24, 2024 | 6:02 AM

Share

బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి కొనుగోలు చేసే వారికి నిన్న మొన్నటి వరకూ ధరలు బెంబేలెత్తిస్తున్నప్పటికీ ఈరోజు ధరలు పెరుగకపోవడం కాస్త ఊరట కల్గించే అంశంగా చెప్పవచ్చు. సాధారణంగా బంగారం ధరలు పెరుగు,తగ్గుదలకు అంతర్జాతీయంగా డాలర్ విలువ ప్రదాన కారణం. ఇది ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరలు స్థిరంగా కొనసాగేందుకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,050 కాగా ఈరోజు కూడా రూ. 63,050 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,800 ఉండగా ఈరోజు రూ.57,800 గా కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే పెద్దగా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇక వెండి విషయానికొస్తే నిన్నటికి ఈరోజుటికి పెద్ద మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్‎లో కిలో వెండి నిన్న రూ. 77,000 ఉండగా.. ఈరోజు కిలోపై రూ. 500 తగ్గి రూ. 76,500 కు చేరింది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 63,050
  • విజయవాడ..రూ. 63,050
  • ముంబాయి..రూ. 63,050
  • బెంగళూరు..రూ. 63,050
  • చెన్నై..రూ. 63,600

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 57,800
  • విజయవాడ..రూ. 57,800
  • ముంబాయి..రూ. 57,800
  • బెంగళూరు..రూ. 57,800
  • చెన్నై..రూ.58,300

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 76,500
  • విజయవాడ..రూ. 76,500
  • చెన్నై..రూ. 76,500
  • ముంబాయి..రూ. 75,000
  • బెంగళూరు..రూ. 73,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..