Gold Price Today: పెరుగుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

Today Gold Rates: బంగారం కొనుగోలు చేసేవారు ఎప్పుడు తగ్గుతుందా.. ఎప్పుడు పెరుగుతుందా..? అంటూ ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిపెడుతుంటారు. అయితే.. దేశంలో కరోనా ఉధృతి

Gold Price Today: పెరుగుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
Gold Price Today
Follow us

|

Updated on: May 18, 2021 | 5:43 AM

Today Gold Rates: బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పసిడి ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోకరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఎప్పుడు తగ్గుతుందా.. ఎప్పుడు పెరుగుతుందా..? అంటూ ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిపెడుతుంటారు. అయితే.. దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల 40వేల చేరువలోకి వచ్చిన ధరలు.. మళ్లీ 45 వేల మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై 260 రూపాయల మేర పెరిగింది. దీంతో మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారం.. 45,330 గా ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం.. ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,150గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,260 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,260 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,260 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 46,500 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ ధర 50,500 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,330 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,330 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,150 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,260 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,690 వద్ద కొనసాగుతోంది.

Also Read;

Telangana EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా..

రేపటి నుంచి 1999 రూపాయలకే సిటీ స్కానింగ్.. వ్యాక్సిన్ ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మితే ఆస్పత్రుల సీజ్..