AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Adani: ప్రపంచంలోనే అతిపెద్ద రాగి కర్మాగారం.. మన దేశంలో ఎక్కడో తెలుసా?

ముంద్రాలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ కాపర్ రిఫైనరీ ప్రాజెక్టులో అదానీ గ్రూప్‌నకు చెందిన కచ్ కాపర్ లిమిటెడ్ ఏడాదికి 10 లక్షల టన్నుల రాగిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదానీ గ్రూప్ 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రాగి కరిగించే కాంప్లెక్స్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధ్యమైతే, భారతదేశం రాగిని దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది..

Gautam Adani: ప్రపంచంలోనే అతిపెద్ద రాగి కర్మాగారం.. మన దేశంలో ఎక్కడో తెలుసా?
Gautam Adani
Subhash Goud
|

Updated on: Feb 06, 2024 | 9:22 AM

Share

గత ఏడాది గుజరాత్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లోప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో గుజరాత్‌లో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు. ఇప్పుడు గుజరాత్‌లో అదానీ గ్రూప్ భారీ రాగి ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ కాపర్ తయారీ ప్లాంట్ అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. సమాచారం ప్రకారం, గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ఓడరేవు నగరమైన ముంద్రాలో ఏర్పాటు చేయనున్న రాగి తయారీ యూనిట్ కోసం 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడిని అంచనా వేస్తున్నారు .

అదానీ గ్రూప్ గుజరాత్‌లోని కచ్ ఎడారిలో 725 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రీన్ ఎనర్జీ పార్క్‌ను నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్ అవుతుంది. ఇందులో సౌరశక్తి నుంచి 30 గిగావాట్ల విద్యుత్‌ను పొందవచ్చు. అలాగే, ఇది సౌర శక్తి నుండి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వ్యవస్థను కలిగి ఉంటుంది. గౌతమ్ అదానీ సంస్థలు సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్లు, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్‌ల తయారీకి మూడు గిగా ఫ్యాక్టరీలను నిర్మించనుంది.

వీటిలో భాగంగానే ప్రపంచంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తి యూనిట్ కూడా రానుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, PV సెల్‌లు, బ్యాటరీలు మొదలైన వాటికి రాగి అవసరం. ఈ కారణంగా, చైనా వంటి కొన్ని దేశాలు రాగి ఉత్పత్తిపై ఆసక్తి చూపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ముంద్రాలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ కాపర్ రిఫైనరీ ప్రాజెక్టులో అదానీ గ్రూప్‌నకు చెందిన కచ్ కాపర్ లిమిటెడ్ ఏడాదికి 10 లక్షల టన్నుల రాగిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదానీ గ్రూప్ 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రాగి కరిగించే కాంప్లెక్స్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధ్యమైతే, భారతదేశం రాగిని దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది. దీని వల్ల రాగి తయారీలో చైనాతో భారత్ పోటీ పడనుంది. క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే పని భారతదేశానికి సులభతరం అవుతుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు