AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Frauds: మొబైల్‌ పేమెంట్‌ యాప్‌లతో జాగ్రత్త.. యూజర్ల నుంచి రూ.కోట్లు దోచేస్తున్న కేటుగాళ్లు

కోవిడ్ మహమ్మారి వల్ల దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్‌లను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం..

UPI Frauds: మొబైల్‌ పేమెంట్‌ యాప్‌లతో జాగ్రత్త.. యూజర్ల నుంచి రూ.కోట్లు దోచేస్తున్న కేటుగాళ్లు
UPI Scam
Srilakshmi C
|

Updated on: Mar 29, 2023 | 1:42 PM

Share

కోవిడ్ మహమ్మారి వల్ల దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్‌లను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఫిబ్రవరి 2022లో యూపీఐ ద్వారా నిర్వహించే రోజువారీ లావాదేవీలు 24 కోట్ల నుంచి 36 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. మొబైల్ పేమెంట్ యాప్‌లను ఉపయోగించే యూజర్లను బోల్తా కొట్టించి కోట్లాదిసొమ్మును కొల్లగొడుతున్నారు. తాజాగా ముంబైలోని 81 మంది యూపీఐ యూజర్ల నుంచి కేటుగాళ్లు దాదాపు కోటి రూపాయలు దోచేశారు. చెల్లింపుల సమయంలో చేసే ‘పేమెంట్‌ మిస్టేక్‌’ల ద్వారా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మాల్వేర్ ఫిషింగ్, హ్యూమన్ ఇంజినీరింగ్‌ టెక్నాలజీలతో చేస్తున్న మోసాల నుంచి మొబైల్ చెల్లింపులు చేస్తున్న యూజర్లను సంరక్షించేందుకు ఇప్పటికే వినియోగిస్తున్న యాంటీ-మాల్వేర్ సాఫ్ట్‌వేర్ సరిపోవడం లేదని నిపుణులు అంటున్నారు.

గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి యూపీఐ అప్లికేషన్‌లను ఉపయోగించి నగదుపంపే యూజర్లకు స్కామర్లు ఫోన్లు చేసి, వారు పంపిన డబ్బు పొరపాటుగా వేరే ఖాతాకు బదిలీ అయ్యిందని, పొరపాటును సరిచేసేందుకు ఫోన్‌ నంబర్‌తోపాటు ఇతర వివరాలను సేకరించి వారి ఖాతాను హ్యాక్‌ చేస్తున్నారు. బాధితులు మరొకమారు నగదు చెల్లింపులు చేసే సమయంలో వారి ఫోన్‌లోని బ్యాంక్ అకౌంట్‌ సమాచారం, పాన్‌ నంబర్‌, ఆధార్, కేవైసీతో సహా మొత్తం డేటా స్కామర్ల చేతిలోకి వెళ్తుంది. ఈ డేటాతో యూజర్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి నేరుగా నగదును దోచేస్తారని ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ ఎక్స్‌పర్ట్‌ పవన్ దుగ్గల్ పేర్కొన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడం, తమ బ్యాంకు ఖాతాకు సంబంధించిన సమాచారం ఎవరితో పంచుకోకపోవడం వల్ల కొంత వరకు సైబర్‌ నేరాలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

యూపీఐ మోసాల నుంచి ఇలా జాగ్రత్తపడండి..

  • విశ్వసనీయ యూపీఐ యాప్‌ని ఉపయోగించడం
  • స్ట్రాంగ్‌ పిన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసుకోవడం
  • యూపీఐ పిన్‌ను ఎవరితో షేర్ చేసుకోకపోవడం
  • అపరిచిత ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండటం
  • యూపీఐ యాప్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవడం
  • లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండటం

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..