TSPSC paper leak case: గ్రూప్ 1 పేపర్ లీక్‌లో మరో బిగ్‌ ట్విస్ట్.. తప్పుమీద తప్పులు చేసిన ప్రవీణ్, రాజశేఖర్‌లు

తెలంగాణ పబ్లిక్‌ కమిషన్‌ సర్వీస్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్ 1 పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్ వెలుగులోకొచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఖరారైన ప్రవీణ్, రాజశేఖర్‌లు తప్పులను కప్పిపెట్టేందుకు మరిన్ని తప్పులకు పాల్పడ్డారు..

TSPSC paper leak case: గ్రూప్ 1 పేపర్ లీక్‌లో మరో బిగ్‌ ట్విస్ట్.. తప్పుమీద తప్పులు చేసిన ప్రవీణ్, రాజశేఖర్‌లు
TSPSC paper leak case
Follow us

|

Updated on: Mar 29, 2023 | 8:05 AM

తెలంగాణ పబ్లిక్‌ కమిషన్‌ సర్వీస్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్ 1 పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్ వెలుగులోకొచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఖరారైన ప్రవీణ్, రాజశేఖర్‌లు తప్పులను కప్పిపెట్టేందుకు మరిన్ని తప్పులకు పాల్పడ్డారు. వీరిద్దరూ గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిన విషయాన్ని టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్‌లు గుర్తించారు. ఐతే ఉన్నతాధికారులకు చెప్తారేమో అనే భయంతో షమీమ్, రమేష్‌లను ప్రవీణ్, రాజశేఖర్‌లు ప్రలోభ పెట్టారు. మీకు కూడా గ్రూప్1 పేపర్ ఇస్తామని, మీరు కూడా ఎగ్జామ్ రాసి జాబ్ సాధించొచ్చు అని ఆశ చూపారు. ఆ విధంగా షమీమ్, రమేష్‌లకు కూడా గ్రూప్‌ 1 పేపర్‌ను పంపించారు.

వీళ్లిద్దరి నుంచే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు, సైదాబాద్‌కి చెందిన సురేష్‌కు పేపర్ లీక్ చేశారు. వీళ్ళు ఇంకా ఎంతమందికి లీక్ చేశారనే కోణంలో ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో షమీమ్, రమేష్, సురేష్‌లకు కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈరోజు నుంచి ఈ ముగ్గురిని సిట్ విచారించనుంది. అలాగే గ్రూప్ 1 రాసి… క్వాలిఫై కాని టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకు కూడా పేపర్ లీక్ విషయం తెలుసా అనే కోణంలోనూ సిట్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.