Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.53వేల ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. ఫోన్‌కు బదులు రెండు నిర్మ సబ్బులు.. వీడియో వైరల్‌

Flipkart: ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు భారీ సెల్‌ నిర్వహించిన విషయంలో తెలిసిందే. అయితే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌లో భాగంగా కస్టమర్లు..

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.53వేల ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. ఫోన్‌కు బదులు రెండు నిర్మ సబ్బులు.. వీడియో వైరల్‌
Follow us

|

Updated on: Oct 11, 2021 | 11:39 AM

Flipkart: ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు భారీ సెల్‌ నిర్వహించిన విషయంలో తెలిసిందే. అయితే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌లో భాగంగా కస్టమర్లు భారీ ఎత్తున ఆర్డర్లు చేసుకున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు కూడా భారీ ఎత్తును అమ్ముడు పోయాయి. ఈ బిగ్‌ బిలియన్‌ సేల్‌లో ఎన్నో ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది ఫ్లిప్‌ కార్టు. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో ఉన్న ఆపిల్‌ ఐఫోన్‌ 12ను ఆర్డర్‌ చేశాడు ఓ వినియోగదారుడు. దాదాపు రూ.53.వేల విలువగల ఐఫోన్‌ను ఆర్డర్ చేస్తే అందులో నిర్మ సబ్బు రావడం కస్టమర్‌ షాక్‌కు గురయ్యాడు. అయితే ఇలాంటి తప్పిదాలు ఇటీవల కూడా జరిగాయి. కేసులు కూడా నమోదు అయ్యాయి. దీంతో కస్టమర్‌ వెంటనే ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే రెండు నిర్మ సబ్బులు వచ్చాయని కస్టమర్‌ సిమ్రన్‌పాల్‌ సింగ్‌ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

స్పందించిన ఫ్లిప్‌కార్ట్‌..

ఐఫోన్‌ బదులు సబ్బులు రావడంతో కస్టమర్‌ ఫిర్యాదు మేరకు ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. డెలివరీ బాయ్‌తో మాట్లాడిన కంపెనీ.. తర్వా త జరిగిన తప్పును అంగీకరించింది. అతని డబ్బులను రీఫండ్‌ చేసింది.

ఇవీ కూడా చదవండి:

Whatsapp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా..? అయితే ఇలా చేశారంటే మీ అకౌంట్‌ బ్లాకే..!

WhatsApp: ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ప్రైవసీ ఫీచర్‌ త్వరలో రాబోతోంది..!