AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈపీఎఫ్‌వో చందాదారులకు శుభవార్త.. త్వరలో మూడు రెట్లు పెరగనున్న పెన్షన్‌..!

EPFO: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)​​ఖాతాదారులు త్వరలో శుభవార్త అందించనుంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. కనీస పెన్షన్  మూడు రెట్లు..

EPFO: ఈపీఎఫ్‌వో చందాదారులకు శుభవార్త.. త్వరలో మూడు రెట్లు పెరగనున్న పెన్షన్‌..!
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 11, 2022 | 6:52 AM

Share
EPFO: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)​​ఖాతాదారులు త్వరలో శుభవార్త అందించనుంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. కనీస పెన్షన్  మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం వచ్చే నెలలో జరగనుందని నివేదికలో పేర్కొన్నారు. కనీస పెన్షన్‌ను మూడు రెట్లు పెంచడంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కనీస పింఛను ప్రస్తుతం రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచవచ్చు. లేబర్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ ఈ విషయంలో తన నివేదికను త్వరలో సమర్పించనుంది. ఈ నిర్ణయం దాదాపు 6.5 లక్షల మంది పెన్షనర్లు, 5 కోట్ల EPFO ​​చందాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
దీంతో పాటు సీబీటీ ఈక్విటీ పరిమితిని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచడంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఈక్విటీలో పెట్టుబడి పెంపుదలకు కార్మిక సంఘం అనుకూలంగా లేదని తెలుస్తోంది. దీని వెనుక స్టాక్ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితి కారణమని ఆయన పేర్కొంటున్నారు.
ఇటీవల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సబ్‌స్క్రైబర్లకు షాకిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. ఇది నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5 శాతం ఉండేది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం 65 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లపై ఉంటుంది.
ఈక్విటీలలో పెట్టుబడిని పెంచడం ద్వారా రాబడిని పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు రెండు వారాల క్రితం ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ కమిటీ సమర్పించే ప్రతిపాదన EPFO ​​సెంట్రల్ బాడీ ఆఫ్ ట్రస్టీల ముందు సమర్పించబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి