ఇకపై 9 గంటలే.! శ్రీలంకకు విమానం లాంటి ప్రయాణం.. ఎలాగంటారా

రోడ్డు, షిప్, రైలు, విమానం.. శ్రీలంకకు ఇలా వివిధ మార్గాల్లో ప్రయాణం చేయవచ్చు. ఏదైనా కూడా సమయం 12 గంటలు పైమాటే. కానీ ఇకపై ఆ కష్టం అక్కర్లేదు. చెన్నై నుంచి కేవలం 9 గంటల్లోనే శ్రీలంకకు వెళ్లిపోవచ్చు. అదెలా అని అనుకుంటున్నారా.?

ఇకపై 9 గంటలే.! శ్రీలంకకు విమానం లాంటి ప్రయాణం.. ఎలాగంటారా
Representative Image
Follow us

|

Updated on: Sep 03, 2024 | 7:30 PM

రోడ్డు, షిప్, రైలు, విమానం.. శ్రీలంకకు ఇలా వివిధ మార్గాల్లో ప్రయాణం చేయవచ్చు. ఏదైనా కూడా సమయం 12 గంటలు పైమాటే. కానీ ఇకపై ఆ కష్టం అక్కర్లేదు. చెన్నై నుంచి కేవలం 9 గంటల్లోనే శ్రీలంకకు వెళ్లిపోవచ్చు. ఇటీవల ప్రధాని మోదీ మూడు వందేభారత్ రైళ్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి చెన్నై టూ నాగర్‌కోయిల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్.

చెన్నై నుంచి నాగర్‌కోయిల్‌ మధ్య ఉన్న 726 కిమీ దూరాన్ని కేవలం 8 గంటల 50 నిమిషాల్లోనే ఈ వందేభారత్ రైలు కవర్ చేస్తుంది. ఇక నాగర్‌కోయిల్ నుంచి, కన్యాకుమారి సుమారు 20 కి.మీ దూరంలో ఉంది. అక్కడ నుంచి శ్రీలంక మనం ఈజీగా వెళ్లిపోవచ్చు. అంటే దాదాపుగా 10 గంటల్లో శ్రీలంక చేరుకోగలం. ప్రస్తుతం ఈ రెండు రూట్ల మధ్య మరో రెండు రైళ్లు ప్రయాణిస్తున్నా.. అవి దాదాపు 12 గంటల సమయం పడుతుంది.

వారానికి ఆరు రోజులు నడిచే ఈ వందేభారత్ ట్రైన్.. చెన్నై ఎగ్మోర్ నుంచి ఉదయం 5 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 1.50 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది. తాంబరం, విల్లుపురం, తిరుచిరాపల్లి, దిండిగల్, మదురై, కోవిల్‌పట్టి, తిరునల్వేలి స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు నాగర్‌కోయిల్‌లో మధ్యాహ్నం 2:20 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 11:00 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుతుంది. కాగా, ఈ వందేభారత్ రైలు ట్రిచీ, మధురై, దిండిగల్, తిరునెల్వేలి పర్యాటక, పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.