AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: వందే భారత్ ట్రైన్ టిక్కెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఎంత నష్టపోతారో తెలిస్తే షాక్

భారతదేశంలోని ప్రజలు ఇటీవల కాలంలో వందే భారత్ ప్రయాణాన్ని ఇష్టపడుతున్నారు. ఉన్న రైళ్లు అన్నింటిలో వేగంగా వెళ్లడమే కాకుండా విమాన ప్రయాణ అనుభూతిని ఇవ్వడంతో ఈ రైలులో ప్రయాణం చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఏ ప్రయాణాలైనా అనుకోని కారణాల వల్ల రద్దయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వందే భారత్ రైలు టిక్కెట్ బుక్ చేసుకుని ప్రయాణం రద్దయితే కచ్చితంగా టిక్కెట్‌ను క్యాన్సిల్ చేసుకుంటాం. ఈ నేపథ్యంలో వందే భారత్‌లో టిక్కెట్ క్యానిలేషన్ చార్జీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Vande Bharat Express: వందే భారత్ ట్రైన్ టిక్కెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఎంత నష్టపోతారో తెలిస్తే షాక్
Vande Bharat
Nikhil
|

Updated on: Nov 17, 2024 | 4:00 PM

Share

ఏ రైలు ప్రయాణికుడైనా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకుంటే ఐఆర్‌సీటీసీ క్యాన్సిలేషన్ చార్జీలను విధిస్తుంది. అలాగే వందే భారత్ ప్రయాణీకులకు కూడా చివరి క్షణంలో  రైలు టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే భారతీయ రైల్వే కొంత మొత్తాన్ని మినహాయిస్తుంది. ముఖ్యంగా కన్‌ఫామ్ టిక్కెట్ లేదా ఆర్ఏసీ, వెయిటింగ్ టిక్కెట్లకు కేటగిరీ ఆధారంగా క్యాన్సిలేషన్ చార్జీలను విధిస్తారు.  వందే భారత్ టిక్కెట్‌కి సంబంధించిన రద్దు ఛార్జీలు టికెట్ తరగతిపై ఆధారపడి ఉంటాయి. రైలు షెడ్యూల్ చేసిన సమయం ఆధారంగా తగ్గింపు ఉంటుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు నడుపుతున్న మీడియం-డిస్టెన్స్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్. ఇది 800 కిమీ (500 మైళ్ళు) కంటే తక్కువ దూరంలో ఉన్న లేదా ఇప్పటికే ఉన్న సేవలతో ప్రయాణించడానికి పది గంటల కంటే తక్కువ సమయం పట్టే నగరాలను కలుపుతూ రిజర్వు చేసిన ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ సర్వీస్.  ఈ రైళ్లు ఎనిమిది లేదా పదహారు కోచ్‌లతో ఉంటాయి. ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ చేసి తయారు చేసింది. 2018లో ప్రారంభించిన ట్రైన్‌సెట్‌లు ట్రయల్స్‌లో గంటకు 183 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయాయి. 

వందే భారత్ టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు

మీరు రైలు బయలుదేరడానికి 48 గంటల కంటే ముందు మీ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే, ఒక్కో ప్రయాణికుడికి ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ తగ్గిస్తారు. ఏసీ ఫస్ట్ క్లాస్/ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ. 240 వరకు తగ్గిస్తారు. రైలు బయలుదేరడానికి 48 నుంచి 12 గంటల ముందు టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే మొత్తం ఛార్జీలో 25 శాతం మినహాయిస్తారు. వాటితో పాటు కనీస ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా విధిస్తారు. మీరు బయలుదేరడానికి 12 నుంచి 4 గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే టిక్కెట్ మొత్తం ఛార్జీలో 50 శాతం తీసేస్తారు. చార్ట్ ప్రిపరేషన్ తర్వాత ఇ-టికెట్‌లను రద్దు చేయడం సాధ్యం కాదు. అయితే మీకు ఆర్ఏసీ లేదా వెయిట్‌లిస్ట్ చేసిన టిక్కెట్ ఉంటే మీరు టీడీఆర్‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చు. పూర్తి వాపసు కోసం క్లర్కేజ్ ఛార్జీని మినహాయించి రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు దానిని రద్దు చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి