AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: వందే భారత్ ట్రైన్ టిక్కెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఎంత నష్టపోతారో తెలిస్తే షాక్

భారతదేశంలోని ప్రజలు ఇటీవల కాలంలో వందే భారత్ ప్రయాణాన్ని ఇష్టపడుతున్నారు. ఉన్న రైళ్లు అన్నింటిలో వేగంగా వెళ్లడమే కాకుండా విమాన ప్రయాణ అనుభూతిని ఇవ్వడంతో ఈ రైలులో ప్రయాణం చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఏ ప్రయాణాలైనా అనుకోని కారణాల వల్ల రద్దయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వందే భారత్ రైలు టిక్కెట్ బుక్ చేసుకుని ప్రయాణం రద్దయితే కచ్చితంగా టిక్కెట్‌ను క్యాన్సిల్ చేసుకుంటాం. ఈ నేపథ్యంలో వందే భారత్‌లో టిక్కెట్ క్యానిలేషన్ చార్జీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Vande Bharat Express: వందే భారత్ ట్రైన్ టిక్కెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఎంత నష్టపోతారో తెలిస్తే షాక్
Vande Bharat
Nikhil
|

Updated on: Nov 17, 2024 | 4:00 PM

Share

ఏ రైలు ప్రయాణికుడైనా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకుంటే ఐఆర్‌సీటీసీ క్యాన్సిలేషన్ చార్జీలను విధిస్తుంది. అలాగే వందే భారత్ ప్రయాణీకులకు కూడా చివరి క్షణంలో  రైలు టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే భారతీయ రైల్వే కొంత మొత్తాన్ని మినహాయిస్తుంది. ముఖ్యంగా కన్‌ఫామ్ టిక్కెట్ లేదా ఆర్ఏసీ, వెయిటింగ్ టిక్కెట్లకు కేటగిరీ ఆధారంగా క్యాన్సిలేషన్ చార్జీలను విధిస్తారు.  వందే భారత్ టిక్కెట్‌కి సంబంధించిన రద్దు ఛార్జీలు టికెట్ తరగతిపై ఆధారపడి ఉంటాయి. రైలు షెడ్యూల్ చేసిన సమయం ఆధారంగా తగ్గింపు ఉంటుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు నడుపుతున్న మీడియం-డిస్టెన్స్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్. ఇది 800 కిమీ (500 మైళ్ళు) కంటే తక్కువ దూరంలో ఉన్న లేదా ఇప్పటికే ఉన్న సేవలతో ప్రయాణించడానికి పది గంటల కంటే తక్కువ సమయం పట్టే నగరాలను కలుపుతూ రిజర్వు చేసిన ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ సర్వీస్.  ఈ రైళ్లు ఎనిమిది లేదా పదహారు కోచ్‌లతో ఉంటాయి. ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ చేసి తయారు చేసింది. 2018లో ప్రారంభించిన ట్రైన్‌సెట్‌లు ట్రయల్స్‌లో గంటకు 183 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయాయి. 

వందే భారత్ టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు

మీరు రైలు బయలుదేరడానికి 48 గంటల కంటే ముందు మీ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే, ఒక్కో ప్రయాణికుడికి ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ తగ్గిస్తారు. ఏసీ ఫస్ట్ క్లాస్/ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ. 240 వరకు తగ్గిస్తారు. రైలు బయలుదేరడానికి 48 నుంచి 12 గంటల ముందు టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే మొత్తం ఛార్జీలో 25 శాతం మినహాయిస్తారు. వాటితో పాటు కనీస ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా విధిస్తారు. మీరు బయలుదేరడానికి 12 నుంచి 4 గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే టిక్కెట్ మొత్తం ఛార్జీలో 50 శాతం తీసేస్తారు. చార్ట్ ప్రిపరేషన్ తర్వాత ఇ-టికెట్‌లను రద్దు చేయడం సాధ్యం కాదు. అయితే మీకు ఆర్ఏసీ లేదా వెయిట్‌లిస్ట్ చేసిన టిక్కెట్ ఉంటే మీరు టీడీఆర్‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చు. పూర్తి వాపసు కోసం క్లర్కేజ్ ఛార్జీని మినహాయించి రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు దానిని రద్దు చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే