AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget-2024: బడ్జెట్‌లో రూ.1111111 కోట్ల కేటాయింపు.. ఈ మేజిక్‌ ఫిగర్‌ ఏంటి?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కూడా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన మోడీ ప్రభుత్వం.. ఏ కొత్త పథకాన్నిగాని, ఆదాయపు పన్నులో ఎటువంటి మార్పును గాని, ఏ పథకానికి ఎటువంటి పెద్ద బడ్జెట్ కేటాయింపులను గాని ప్రకటించలేదు. అయితే ఆమె ప్రభుత్వ మూలధన వ్యయం, మౌలిక సదుపాయాలపై ఖర్చులను పెంచే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

Budget-2024: బడ్జెట్‌లో రూ.1111111 కోట్ల కేటాయింపు.. ఈ మేజిక్‌ ఫిగర్‌ ఏంటి?
Budget 2024
Subhash Goud
|

Updated on: Feb 02, 2024 | 8:52 AM

Share

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్ సంప్రదాయం ప్రకారం.. ఈ బడ్జెట్‌లో పెద్దగా ఊరటనిచ్చే ప్రకటనలు చేయలేదు. కానీ 11,11,111 అనే ఒక్క నంబర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అన్నింటికంటే ఈ సంఖ్య వెనుక ఉన్న గణితం ఏమిటి ? దేశ పురోగతికి ఇది ఎలా బాధ్యత వహిస్తుంది? దీని గురించి తెలుసుకుందాం.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కూడా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన మోడీ ప్రభుత్వం.. ఏ కొత్త పథకాన్నిగాని, ఆదాయపు పన్నులో ఎటువంటి మార్పును గాని, ఏ పథకానికి ఎటువంటి పెద్ద బడ్జెట్ కేటాయింపులను గాని ప్రకటించలేదు. అయితే ఆమె ప్రభుత్వ మూలధన వ్యయం, మౌలిక సదుపాయాలపై ఖర్చులను పెంచే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

11,11,111 లెక్క ఏమిటి?

ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం తన మూలధన వ్యయాన్ని పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం 11.1 శాతం పెరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఈ మొత్తం రూ.11,11,111 కోట్లకు చేరింది. ఇది దేశ జిడిపిలో 3.4 శాతానికి సమానం. గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల మూలధన వ్యయం లక్ష్యంగా పెట్టుకుంది.

కాపెక్స్ మూడు రెట్లు పెరిగింది

గత నాలుగేళ్లలో ప్రభుత్వ మూలధన వ్యయం (క్యాపెక్స్) మూడు రెట్లు పెరిగింది. ఇది దేశం వేగంగా ఆర్థిక ప్రగతిని సాధించడంలో దోహదపడింది. అదే సమయంలో దేశంలో ఉపాధి కూడా పెద్ద ఎత్తున సృష్టించబడింది. ప్రభుత్వ మూలధన వ్యయం ప్రభావం ఆర్థిక వ్యవస్థలో గుణకార ప్రభావాన్ని సృష్టిస్తుంది. ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు చేస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ మూడు రెట్లు ఎక్కువ ప్రయోజనం పొందుతుంది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ మొత్తం పరిమాణం 6.1 శాతం పెరిగి రూ.47.66 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ వ్యయం పెరగడం, క్యాపెక్స్‌లో పెరుగుదల, సామాజిక రంగ పథకాలకు అధిక కేటాయింపుల కారణంగా బడ్జెట్ పరిమాణం పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి