AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UK Fighter Jet: తిరువనంతపురంలో యూకే ఫైటర్ జెట్ అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే..

UK Fighter Jet: ఇదిలా ఉండగా, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన 19 మందిని గుర్తించారు. వారిని DNA పరీక్ష ద్వారా వారిని గుర్తించారు. DNA నమూనా పరీక్ష ఇంకా కొనసాగుతుంది. గుర్తించిన వ్యక్తులు గుజరాత్, మధ్యప్రదేశ్, జస్థాన్‌ కు చెందినవారు.

UK Fighter Jet: తిరువనంతపురంలో యూకే ఫైటర్ జెట్ అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే..
Uk Fighter Jet
Subhash Goud
|

Updated on: Jun 15, 2025 | 11:48 AM

Share

తిరువనంతపురం విమానాశ్రయంలో బ్రిటిష్ యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. 100 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న యుద్ధ నౌక నుండి బయలుదేరిన F-35 విమానం తిరువనంతపురంలో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఈ సంఘటన నిన్న రాత్రి జరిగింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల విమానం విమానాశ్రయానికి తిరిగి రాలేకపోయింది. ఆ తర్వాత అది తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఇంధనం తక్కువగా ఉండటం నిన్న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో ఒకే ఒక్క పైలట్ ఉన్నట్టు సమాచారం. భారత సైన్యం అనుమతి పొందిన తర్వాత విమానానికి ఇంధనం నింపుతారు. వైమానిక దళం కూడా తనిఖీ చేస్తుంది. రక్షణ శాఖ విధివిధానాలు పూర్తి చేసిన తర్వాత విమానం వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. ప్రస్తుతం విమానం డొమెస్టిక్ బేలో ఉందని తెలుస్తోంది.

19 మందిని గుర్తించారు.

ఇదిలా ఉండగా, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన 19 మందిని గుర్తించారు. వారిని DNA పరీక్ష ద్వారా వారిని గుర్తించారు. DNA నమూనా పరీక్ష ఇంకా కొనసాగుతుంది. గుర్తించిన వ్యక్తులు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు చెందినవారు.

కొంతమంది విదేశీయులను కూడా గుర్తించారు. గుర్తించిన మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తారు. గుజరాత్‌కు చెందిన పూర్ణిమ పటేల్ మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించారు. ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. తన కొడుకును కలవడానికి లండన్‌కు బయలుదేరుతుండగా పూర్ణిమ ప్రమాదంలో చిక్కుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి