AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Prices: మద్యం ప్రియులకు షాకింగ్‌న్యూస్‌.. పెరగనున్న బీర్ల ధరలు!

సాయంత్రం అయ్యిందంటే చాలు బార్లలో మందుబాబులతో కిటకిటలాడుతుంటాయి. రోజురోజుకు లిక్కర్‌ అమ్మకాలు జోరుగా పెరిగిపోతున్నాయి. అయితే ధర ఎంత ఉన్నా అమ్మకాలు మాత్రం ఆగవు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే బీర్ల తయారీ కేంద్రాల (బ్రూవరీల)కు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను..

Liquor Prices: మద్యం ప్రియులకు షాకింగ్‌న్యూస్‌.. పెరగనున్న బీర్ల ధరలు!
Liquor Shop
Subhash Goud
|

Updated on: Aug 07, 2024 | 8:45 AM

Share

సాయంత్రం అయ్యిందంటే చాలు బార్లలో మందుబాబులతో కిటకిటలాడుతుంటాయి. రోజురోజుకు లిక్కర్‌ అమ్మకాలు జోరుగా పెరిగిపోతున్నాయి. అయితే ధర ఎంత ఉన్నా అమ్మకాలు మాత్రం ఆగవు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే బీర్ల తయారీ కేంద్రాల (బ్రూవరీల)కు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 శాతం మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ భారం వినియోగదారులపైనే పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరు బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు తయారు అవుతోంది. ఆ బీరును తెలంగాణ రాష్ట్రంబేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎ్‌సబీసీఎల్‌) కొనుగోలుచేసి.. మద్యం దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో 12 బీర్ల కేసుకుగాను బ్రూవరీలకు టీఎస్‌బీసీఎల్‌ రూ.289 చెల్లిస్తోంది. పన్నులన్నీ కలుపుకొని కేసుకు రూ.1400 చొప్పున రిటైలర్లకు (మద్యం దుకాణాలు) విక్రయిస్తుండగా.. ఇతర ఖర్చులన్నీ కలిపి మద్యం దుకాణాలవారు కేసు రూ.1800 చొప్పున విక్రయిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కస్టమర్లకు షాకింగ్ న్యూస్‌.. రీఛార్జ్‌ ధరలు మళ్లీ పెరగనున్నాయా? టెన్షన్‌ పెడుతున్న ట్రాయ్‌ రూల్స్‌

అంటే.. ఒక్కో బీరునూ ప్రభుత్వం బ్రూవరీల వద్ద రూ.24.08కి కొనుగోలు చేసి రూ.116.66కి మద్యం దుకాణాలకు విక్రయిస్తుండగా.. వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ఒక్కో బీరు ధరా రూ.150 అవుతోంది. రాష్ట్రంలో బీర్ల డిమాండ్‌కు తగ్గట్టు ప్రభుత్వ ఆర్డర్లపై బ్రూవరీలు బీర్లను ఉత్పత్తి చేస్తాయి.

ఇవి కూడా చదవండి

రెండేళ్ల పాటు ఒప్పందం:

అయితే బ్రూవరీలతో సర్కార్‌ కుదుర్చుకునే ఒప్పందం రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. గడువు పూర్తయ్యాక ధరలను సవరించి మళ్లీ రెండేళ్ల ఒప్పందాన్ని కొనసాగిస్తారు. ప్రతి రెండేళ్లకూ బ్రూవరీలకు చెల్లించే ధరను ప్రభుత్వం దాదాపు 10 శాతం మేర పెంచుతూ ఉంటుంది.

చివరిసారిగా రెండేళ్ల క్రితం 2022 మే నెలలో 6శాతంచొప్పున రెండుసార్లు పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈసారి 20-25 శాతం పెంచాలంటూ బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేర పెంచినట్లయితే ధరలను పెంచాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రభావం మందుబాబుపై పడే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం వినియోగదారులపై భారం ఎక్కువగా ఉంటుందని భావించిన ప్రభుత్వం 10-12శాతం వరకూ పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిసింది. ఒక వేళ ధరలు పెంచాలని నిర్ణయిస్తే కేవలం బీర్లపైనే ఉండనుంది. మిగతా వాటి ధరలు అలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Whatsapp: ఈ ఫోన్లు మీ వద్ద ఉన్నాయా? 35 ఫోన్‌లలో వాట్సాప్‌ బంద్‌.. లిస్ట్‌ చెక్‌ చేసుకోండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి