AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharti Airtel Tariffs: ఎయిర్ టెల్ కస్టమర్స్‌కు షాక్. రేపటి నుంచి పెరగనున్న కనీస ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

Airtel raises minimum prepaid plan : భారతీ ఎయిర్‌టెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కనీస ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను రూ .49 నుంచి రూ .79 కు పెంచుతూ నిర్ణయం..

Bharti Airtel Tariffs: ఎయిర్ టెల్ కస్టమర్స్‌కు షాక్. రేపటి నుంచి పెరగనున్న కనీస ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
Airtel Raises
Surya Kala
|

Updated on: Jul 28, 2021 | 3:59 PM

Share

Airtel raises minimum prepaid plan : భారతీ ఎయిర్‌టెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కనీస ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను రూ .49 నుంచి రూ .79 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోస్ట్ పెయిడ్ పన్నులను సవరించిన కొన్ని వారాల తర్వాత ఈ ప్రకటన చేసింది. ఇప్పటివరకూ ఉన్న 49 ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేశామని ఎయిర్‌టెల్ యాజమాన్యం తెలిపింది. దీంతో రేపటి నుంచి ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ ప్యాక్‌లు ఇప్పుడు రూ .79 నుండి ప్రారంభంకానున్నాయి. ఈ ప్యాక్ తో రీఛార్జ్ చేయించుకునే వినియోగదారులు డబుల్ డేటాతో పాటు నాలుగు రెట్లు ఎక్కువ అవుట్‌ గోయింగ్ నిమిషాలు అదనపు ప్రయోజనాలుగా పొందనున్నారు.

అయితే ఈ ప్రారంభ రికార్జ్ ను పెంచినా తమ కస్టమర్లు తమ ఖాతా బ్యాలెన్స్ ను గురించి ఆలోచికుండా ఉండేలా ఈ విధంగా అదనపు ప్రయోజనాలు అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. రూ .79 రీఛార్జ్ ప్యాక్‌తో .. ఎయిర్‌టెల్ లోకల్, ఎస్‌టిడి కాల్‌లకు వర్తించే సెకనుకు ఒక పైసాతో రూ .64 విలువైన టాక్‌టైమ్‌ను అందిస్తోంది. అంతేకాదు ఈ ప్లాన్ లో భాగంగా 200MB డేటా ను ఇస్తుంది. ఈ ప్యాక్ వినియోగం 28 రోజులు పాటు కాలపరిమితి ఉండనుంది. ఈ సవరించిన ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్ జూలై 29 నుండి వర్తిస్తుంది.

ప్రీపెయిడ్ కస్టమర్లు కంపెనీ మొత్తం చందాదారుల్లో 95% ఉన్నారు. అయితే పన్నులను అనుసరించి టారిఫ్ ను పెంచిన మొదటి టెలికాం సంస్థ ఎయిర్ టెల్.. అయితే ఎయిర్ టెల్ బాటలో మరిన్ని కంపెనీలు అనుసారించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Also Read: Suicide Plant: ప్రపంచంలోనే డేంజర్ మొక్కల్లో ఇది ఒకటి.. దీనిని తాకితే నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటారట

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి