AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group Merger Plan: గౌతమ్ అదానీ తన రెండు సిమెంట్ కంపెనీలను విలీనం చేయబోతున్నారా?

అదానీ గ్రూప్ తన రెండు సిమెంట్ వ్యాపార సంస్థలైన ఏసీసీ, అంబుజా సిమెంట్లను విలీనం చేయబోతోందని చాలా రోజులుగా మార్కెట్‌లో చర్చ నడుస్తోంది . ఇప్పుడు ఈ ఊహాగానాలకు సంబంధించి అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీల..

Adani Group Merger Plan: గౌతమ్ అదానీ తన రెండు సిమెంట్ కంపెనీలను విలీనం చేయబోతున్నారా?
Adani
Subhash Goud
|

Updated on: Jul 23, 2023 | 4:00 AM

Share

అదానీ గ్రూప్ తన రెండు సిమెంట్ వ్యాపార సంస్థలైన ఏసీసీ, అంబుజా సిమెంట్లను విలీనం చేయబోతోందని చాలా రోజులుగా మార్కెట్‌లో చర్చ నడుస్తోంది . ఇప్పుడు ఈ ఊహాగానాలకు సంబంధించి అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీల ఏసీసీ, అంబుజా సిమెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అజయ్ కపూర్ చాలా సమాచారాన్ని వెల్లడించారు.

ఏసీసీ, అంబుజా సిమెంట్‌లను విలీనం చేసే ఆలోచన లేదు: అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ తరపున అజయ్ కపూర్, ఏసీసీ, అంబుజా సిమెంట్ రెండూ వేర్వేరు సంస్థలుగా కొనసాగుతాయని, ఈ రెండింటినీ విలీనం చేసే ఆలోచన లేదని ఆదానీ గ్రూప్‌ స్పష్టం చేసింది. వార్షిక వాటాదారుల సమావేశంలో అజయ్ కపూర్ ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. దీని ప్రభావం ఈ రోజు రెండు కంపెనీల షేర్లలో పెద్ద కదలికను చూడవచ్చు.

2022 సంవత్సరంలో అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్, ఏసీసీ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ముఖ్యంగా, 2022 సంవత్సరంలో, అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్ హోల్సిమ్ నుంచి అంబుజా సిమెంట్, ఏసీసీని కొనుగోలు చేసింది. ఇప్పుడు రెండు కంపెనీలను విలీనం చేసే ఆలోచన లేదని అదానీ గ్రూప్ స్పష్టం చేయడంతో, అల్ట్రాటెక్ సిమెంట్ తర్వాత దేశంలోనే అతిపెద్ద సిమెంట్ తయారీ గ్రూప్ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఏసీసీ, అంబుజా సిమెంట్ గణాంకాలు

అంబుజా సిమెంట్, ఏసీసీ సంయుక్త స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 67.5 MTPA. రెండు కంపెనీలుగా అవి భారతదేశంలో బలమైన సిమెంట్ బ్రాండ్‌లు, చాలా బలమైన తయారీ, సరఫరా విషయంలో మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి. దీని కింద, వారు భారతదేశంలో 14 మిక్సింగ్ యూనిట్లు, 16 గ్రైండింగ్ యూనిట్లు, 79 రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు, 78,000 ఛానెల్ భాగస్వాములను కలిగి ఉన్నారు.