AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెరుగుతుందో తెలుసా..?

కేంద్ర ఉద్యోగులకు కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలో ప్రభుత్వం వీరికి కరువు భత్యం పెంపు బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జూలై 31న, AICPI ఇండెక్స్ గణాంకాలను కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. దీని..

7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెరుగుతుందో తెలుసా..?
Da
Subhash Goud
|

Updated on: Jul 22, 2023 | 5:18 PM

Share

కేంద్ర ఉద్యోగులకు కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలో ప్రభుత్వం వీరికి కరువు భత్యం పెంపు బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జూలై 31న, AICPI ఇండెక్స్ గణాంకాలను కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ని ఎంత శాతం పెంచాలనేది నిర్ణయించనున్నారు. అయితే, ఇప్పటి వరకు డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపు ఉండొచ్చని ఏఐసీపీఐ గణాంకాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా, కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను ఏడాదికి రెండుసార్లు సవరిస్తారు. జనవరిలో డీఏ పెంచబడింది. అలాగే ఇప్పుడు జులైకి డియర్‌నెస్ అలవెన్స్ పెరిగింది. జనవరి నుండి ప్రభావవంతమైన డీఏ 42 శాతం, ప్రభుత్వం జులై తర్వాత డీఏ పెంచినట్లయితే, అప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 46 శాతానికి పెరగవచ్చు. ఎందుకంటే ఇది 4 శాతం డీఏ పెరుగుతుంది.

ఏఐసీపీఐ ఇండెక్స్‌ గణాంకాలు ఏం చెబుతున్నాయి?

మే 2023 వరకు ఉన్న గణాంకాలను ఇప్పటివరకు కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో డియర్‌నెస్ అలవెన్స్ రేటు 45.57 పాయింట్లకు చేరుకుంది. అంటే ఈ లెక్కన 4 శాతం డీఏ పెంపు దాదాపు ఖాయమన్నమాట. అయితే, జూన్‌కు సంబంధించిన గణాంకాలు జూలై 31న విడుదల కానున్నాయి. ఆ తర్వాత డీఏ ఎంత శాతం పెరుగుతుందనేది మరింత స్పష్టమవుతుంది. జూలైలో 4 శాతం డీఏ పెంపు ఉంటుందని, ఆ తర్వాత ఉద్యోగుల డీఏ 46 శాతానికి పెరుగుతుందని అంచనా.

ఇవి కూడా చదవండి

జూలై 1 నుంచి రేట్లు వర్తిస్తాయి

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఏడాది రెండోసారి డీఏ పెంపుదల ఉంటుంది. ప్రభుత్వం వైపు నుండి డీఏ పెంపు జూలై 1 నుండి లెక్కించబడుతుంది. ఈ పెంపు తర్వాత 1 కోటి మంది ఉద్యోగులు-పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. వచ్చే ఎన్నికలకు ముందు, రక్షాబంధన్‌ నుంచి దీపావళి మధ్య ఎప్పుడైనా కరువు భత్యాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

జీతం ఎంత పెరుగుతుంది

ఒక ఉద్యోగి మూల వేతనం రూ.18000 అయితే, దానిపై 42% డీఏ విధిస్తారు. అంటే డియర్‌నెస్ అలవెన్స్ రూ.7560. మరోవైపు, 46 శాతం డియర్‌నెస్ అలవెన్స్ కలిపితే, అది నెలకు రూ.8280 అవుతుంది. దీని ప్రకారం ప్రతి నెలా రూ.720 పెరుగుతుంది. అంటే ఏటా రూ.8 వేలకు పైగా పెరుగుదల ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి