AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay : మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా నిర్మలమ్మ బడ్జెట్.. పొగచూరిన జీవితాలకు ఇది వెలుగు రేఖ..

పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలే బడ్జెట్ ఉందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. మొట్ట మెదటి సారిగా బడ్జెట్‌ను ఆరు భాగాలుగా విభజించి...

Bandi Sanjay : మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా నిర్మలమ్మ బడ్జెట్.. పొగచూరిన జీవితాలకు ఇది వెలుగు రేఖ..
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 5:28 PM

Share

Bandi Sanjay : ఆత్మనిర్భర భారత్‌లో రూ.21.17 లక్షల కోట్లు కేటాయించారని తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలిపింది. ఈ దేశం మూలాల్లో ఆత్మనిర్భర్ భారత్ ఉందని గుర్తు చేశారు. యూనియన్‌బడ్జెట్ 2021 ఆశావాదంతో నిండి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అభిప్రయాపడ్డారు. ఇది సబ్ కా విశ్వస్ లక్ష్యంతో బడ్జెట్ నిర్మించారిని తెలిపారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌ సభలో ప్రవేశపెట్టిన పెట్టిన బడ్జెట్‌ ను బీజెపీ రాష్ట్ర శాఖ స్వాగతించింది. దేశ ప్రజల అంచనాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా. ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించే విధంగా దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలే బడ్జెట్ ఉందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. మొట్ట మెదటి సారిగా బడ్జెట్‌ను ఆరు భాగాలుగా విభజించి ప్రతీ రంగానికి ప్రత్యేక నిధులు మరియు విధానపర నిర్ణయాలు ప్రకటించడం ద్వారా 2021-22లో భారత ఆర్ధిక ప్రగతి పరుగు పెడుతుందనడంలో సందేహం లేదని అన్నారు.

అదనంగా మరో కోటి మందికి మహిళల కు ఉజ్వల పథకం కింద ఉచిత సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వరా పొగచూరిన మహిళల జీవితాలలో వెలుగులు నింపిన బడ్జెట్ అని పేర్కొన్నారు. కరోనాతో నెమ్మదించిన దశ ఆర్ధిక వ్యవస్థకు మళ్లీ ఉరుకులు పెట్టించే బడ్జెట్ అని తెలిపారు. కరోనా తర్వాత ప్రజల్లో భారత ప్రగతిపై విశ్వాసం పెంచేలా ఈ బడ్జెట్ను రూపొందించారు అని అన్నారు. కరోనా నేర్పిన పాఠంతో… ఆరోగ్యరంగానికి బడ్జెట్‌లో పెద్దపీట వేసిందని అన్నారు.

కరోన మహమ్మారితో ప్రపంచ ఆర్ధిక వ్యస్థ అతలాకుతమవుతున్న తరుణంలో భారత దేశం అభివృద్ది దిశగా ముందడుగు వేయడం శుభసూచకం అని ఎంపీ బండి సంజయ్ అన్నారు. అభివృద్ది చెందిన దేశాలో సైతం ఆర్ధిక పరిస్థితి కుదేలై కొనుగోలు శక్తి పడిపోయిని ఈ పరిస్థితులో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే విధంగా అర్ధిక వ్యవస్థను గాడిలోకి రావడం గౌరవ ప్రధాని నరేంద్రమోది తీసుకున్న నిర్ణయాలతోనే సాధ్యం అయిందని పేర్కొన్నారు.

కోవిడ్ వైరస్ ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. డిజిటల్‌ పద్ధతిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మల.. గంటా 51 నిముషాలపాటు ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!