Budget 2022: రాబోయే బడ్జెట్ నుంచి బ్యాంకింగ్ రంగంలో ఎటువంటి మార్పులు మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు?

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్దికసంవత్సరానికి సంబంధించి దేశ బడ్జెట్ త్వరలో ప్రకటించనుంది. ఈ నేపధ్యంలో బ్యాంకింగ్ రంగానికి(Banking Industry) సంబంధించి ఆర్ధిక మంత్రి మధ్యతరగతి ప్రజలకోసం ఎటువంటి విధానాలను ప్రకటించవచ్చు అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Budget 2022: రాబోయే బడ్జెట్ నుంచి బ్యాంకింగ్ రంగంలో ఎటువంటి మార్పులు మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు?
Banking Budget
Follow us

|

Updated on: Jan 19, 2022 | 10:41 AM

Banking Budget 2022: కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్దికసంవత్సరానికి సంబంధించి దేశ బడ్జెట్ త్వరలో ప్రకటించనుంది. ఈ నేపధ్యంలో బ్యాంకింగ్ రంగానికి(Banking Industry) సంబంధించి ఆర్ధిక మంత్రి మధ్యతరగతి ప్రజలకోసం ఎటువంటి విధానాలను ప్రకటించవచ్చు అనే అంశం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది డిసెంబర్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సంస్కరణల విషయంలో మోదీ ప్రభుత్వ విధానం “మధ్యతరగతి అవసరాలకు సున్నితమైనది” అంటూ ఒక ప్రకటన చేశారు. బ్యాంకింగ్ రంగ సంస్కరణలను ఉద్దేశించి ఆమె ఆ ప్రకటన చేశారు, మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని వాటిని ప్రవేశపెట్టినట్లు ఆమె చెప్పారు. ఆర్థికమంత్రి మాటలు బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ వంటి పథకాలకు సంబంధించినది అయివుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకింగ్ సంస్కరణల్లో భాగంగా మధ్యతరగతి ప్రజల కోసం తీసుకువస్తున్న పధకాలు వారి జీవితాల్లో వెలుగులు తీసుకువస్తాయనే విషయాన్ని కాదనలేం. కానీ, నిజంగా మధ్యతరగతి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా బేరీజు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంలో కొందరు మధ్యతరగతి ప్రజలను టీవీ9 పలకరించింది. ఈ బడ్జెట్ నుంచి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రజలు ఏమి కోరుకుంటున్నారనే విషయంపై వారు వెలుబుచ్చిన అభిప్రాయాలేమిటో తెలుసుకుందాం.

మెరుగైన సామాజిక భద్రతా వ్యవస్థ అవసరం..

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఏకాంబరం ”మధ్యతరగతి ప్రజలకు మరింత డబ్బు ఆదా చేయడంలో సహాయపడటానికి మెరుగైన సామాజిక భద్రతా వ్యవస్థ ఉత్తమ మార్గం” అని భావిస్తున్నట్టు చెప్పారు. అంటే బ్యాంకుల్లో అర్తికభాద్రతను కల్పిస్తూనే మరింత మెరుగైన రాబడి అందించే పథకాలను తీసుకు వస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. దాదాపుగా చాలామంది ప్రజలు ఈ అంశాన్ని కోరుకుంటున్నారు. తమ దగ్గర ఉన్న చిన్న చిన్న మొత్తాలను బ్యాంకులలో డిపాజిట్ చేస్తే వాటిపై రాబడి అంతంత మాత్రంగానే ఉంటోందనీ.. ఇక ఎప్పటికప్పుడు బ్యాంకుల వడ్డీరేట్లు సవరిస్తూ రావడంతో వాటిపై సరైన ఆదాయం వచ్చే అవకాశం లేకుండా పోయిందనీ అంటున్నారు. దీనికోసం వివిధరకాలైన పెట్టుబడి మార్గాలలోకి ప్రజలు మళ్లుతున్నారు. అయితే, వీటిలో ఒక్కోసారి తగిలే ఎదురుదెబ్బలకు అసలు కూడా నష్టపోయి ప్రజలు మిగిలిపోతున్నారని ఆయన అన్నారు. అందుకే ప్రభుత్వం సాధారణ ప్రజల పొదుపు కోసం ప్రత్యెక పథకాలు పకటిస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక వివిధ వర్గాల ప్రజలు బ్యాంకులను ప్రైవేటీకరించడం పై కూడా స్పందించారు. అన్ని బ్యాంకులు ప్రైవేట్ సెక్టార్ లోకి వెళ్ళిపోతే ప్రజల సొమ్ముకు భరోసా ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చే సేవలకు ప్రయివేట్ బ్యాంకు సేవలకు చాలా తేడా ఉంటుందనీ.. బ్యాంకుల ప్రయివేటీకరణపై పునఃపరిశీలన చేయాలనీ కోరుతున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ పెద్దగా అందుబాటులో లేదనీ.. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడం.. బ్యాంకుల్లో తమ సొమ్ము డిపాజిట్ చేసుకునే విధంగా గ్రామీణ ప్రజలను ప్రోత్సహించడం అవసరమని మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని మధ్య తరగతి ప్రజలకు మరింత చేరువలోకి వచ్చేలా బ్యాంకింగ్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ లో ప్రతిపాదనలు ఉంటాయని ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Worlds Powerful Passports: ప్రపంచ వ్యాప్తంగా పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ ర్యాంకులో భారత్‌.. ఎన్నో ర్యాంకు అంటే..!

Pakistan: భూకంపంతో వణికిపోయిన పాకిస్తాన్.. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రత..