AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలి: నిర్భయ తల్లి

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలని నిర్భయ తల్లి ఆశా దేవీ డిమాండ్ చేశారు. సుశాంత్ కుటుంబానికి తన మద్దతు ఉంటుందని ఆమె అన్నారు.

సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలి: నిర్భయ తల్లి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2020 | 3:21 PM

Share

Nirbhaya Mom on Sushant case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలని నిర్భయ తల్లి ఆశా దేవీ డిమాండ్ చేశారు. సుశాంత్ కుటుంబానికి తన మద్దతు ఉంటుందని ఆమె అన్నారు. సుశాంత్‌ మృతిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు విషయాలను పంచుకున్నారు.

”తమకు న్యాయం జరగాలంటూ చేతులు జోడించి సుశాంత్ సోదరి అభ్యర్థిస్తుండటం చూడగానే నాకు చాలా బాధగా అనిపించింది. ఇంతవరకు నేను సుశాంత్ కుటుంబాన్ని కలవలేదు, మాట్లాడలేదు. కానీ వారి బాధ ఎలాంటిదో నాకు తెలుసు. ఎందుకంటే నా కుమార్తెకు న్యాయం జరగాలంటూ నేను చాలా కాలం పాటు పోరాడాను. నిజం కచ్చితంగా బయటకు వస్తుంది. కచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అని సుశాంత్ సోదరికి, అతడి కుటుంబానికి చెప్పాలనుకుంటున్నా. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు, బీహార్ పోలీసులతో పాటు ఎంతోమంది మీకు మద్దతుగా ఉన్నారు. న్యాయం జరిగేందుకు కాస్త సమయం పట్టొచ్చు. కానీ గెలిచి తీరుతుంది. ముంబయి పోలీసులు కూడా వారికి సాయం చేయాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

”సుశాంత్ విషయంలో కాస్త సంయమనం పాటించాలని ఓ మంత్రి చెప్పిన మాటలను విన్నాను. కానీ కొడుకును పోగొట్టుకున్న ఎవరూ అలా ఉండలేరు. ఆ వృద్ధ తండ్రి బాధ వర్ణానాతీతం. సుశాంత్‌ మరణించి రెండు నెలలు అవుతున్నా ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదు. అలాంటప్పుడు ఆ తండ్రిని ప్రశాంతంగా ఎలా ఉండమంటారు. జీవితంలో కుమారుడిని పోగొట్టుకున్న వారు ప్రశాంతంగా ఉండలేరు. సుశాంత్ కేసు విషయంలో న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా” అని ఆశా దేవీ వెల్లడించారు.

Read More:

నా సర్వస్వం నువ్వే.. ఐ లవ్‌ యు: మిహీక

మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. 22 రోజులకు 20లక్షల బిల్లు