AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ.. ధాన్యం సేకరణలో టాప్

యాసంగిలో దేశవ్యాప్తంగా పరి సాగు, దిగుబడిలో తెలంగాణ రికార్డు సాధించింది. యాసంగిలో వరి ధాన్యం సేకరణలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.01 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్లు ఎఫ్‌సీఐ పేర్కొంది. అందులో తెలంగాణ రాష్ట్రం వాటానే 52.23గా ఉందని పేర్కొంది. దేశం నిర్దేశించుకున్న 91.07 లక్షల టన్నుల లక్ష్యంలో సగం కంటే ఎక్కువగా తెలంగాణ నుంచే సేకరించినట్లు ఎఫ్‌సీఐ వివరించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ […]

దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ.. ధాన్యం సేకరణలో టాప్
paddy
Balaraju Goud
|

Updated on: May 27, 2020 | 7:28 PM

Share

యాసంగిలో దేశవ్యాప్తంగా పరి సాగు, దిగుబడిలో తెలంగాణ రికార్డు సాధించింది. యాసంగిలో వరి ధాన్యం సేకరణలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.01 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్లు ఎఫ్‌సీఐ పేర్కొంది. అందులో తెలంగాణ రాష్ట్రం వాటానే 52.23గా ఉందని పేర్కొంది. దేశం నిర్దేశించుకున్న 91.07 లక్షల టన్నుల లక్ష్యంలో సగం కంటే ఎక్కువగా తెలంగాణ నుంచే సేకరించినట్లు ఎఫ్‌సీఐ వివరించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం రైతుల పండించిన ధాన్యాన్ని అధికారికంగా కొనుగోలు చేసింది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ వ్యవసాధికారులకు ప్రత్యేక సడలింపులు ఇస్తూ ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది తెలంగాణలో భారీగా వరి ధాన్యం దిగుబడి కూడా రావడం విశేషం. దీంతో ఎఫ్‌సీఐ పెద్ద ఎత్తున ధాన్యం సేకరించింది.